దంచికొడుతున్న ఎండలు.. రోజంతా హుషారుగా ఉండాలంటే?
మరి ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ఎనర్జీ పోయి నీరసపడి పోకుండా ఎంతో చురుకుగా చలాకీగా ఉండడానికి తీసుకోవలసిన కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది ఎండాకాలంలో ఆహారం తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపరు. అయితే సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో హుషారుగా ఉండే అవకాశం ఉంటుందని.. అంతేకాకుండా రోజుకి కనీసం పది గ్లాసుల నీళ్లు తాగాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఇక గ్లాసులో గోరువెచ్చని నీరు తీసుకుని చెంచా నిమ్మరసం ఒక చెంచా అల్లం రసం రెండు చెంచాల తేనె కలిపి తాగితే వెంటనే నీరసం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ఒక గ్లాసు పల్చని మజ్జిగలో చెంచ పుదీనా రసం చెంచా నిమ్మరసం కలిపి అందులో చిటికెడు ఉప్పు వేసి తాగితే నీరసంతో కళ్లు తిరగడం తగ్గి కాస్త శక్తి వస్తుందట. ఒక గ్లాసు నల్ల ద్రాక్ష రసం తాగినా కూడా ఎంతో ఉపశమనం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండేలా ప్రతి రోజు ప్లాన్ చేసుకోవాలి అంటు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు వెళ్ళిన ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు పలురకాల జాగ్రత్తలు పాటించాలి అంటూ చెబుతున్నారు నిపుణులు.