జిమ్ చేస్తే ప్రాణం పోతుందా.. అందరిలో భయం భయం?
వినయ కుమారీ అనే 44 ఏళ్ళ మహిళలు వ్యాయామం చేస్తూ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ జరిగిన ఘటన చిన్నదే అయినప్పటికీ ఇక గతంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు పెద్దవాళ్ళ విషయంలోను జరిగాయి. ఏకంగా కన్నడ పవర్ స్టార్ గా కొనసాగుతున్న పునీత్ రాజ్కుమార్ వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే చివరికి అప్పటికే ప్రాణాలు వదిలారు. దీంతో ఎంతో మంది అభిమానులు దిగ్భ్రాంతిలో మునిగిపోయారు.
ఇక మొన్నటికి మొన్న ఏపీలో ఐటీ శాఖ మంత్రిగా కొనసాగుతున్న గౌతంరెడ్డి ఫిట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంతేకాదు బాడీ బిల్డర్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఇక ఇలా రోజు వ్యాయామం చేసే గౌతమ్ రెడ్డి హఠాత్తుగా గుండెపోటు గురికావడం గమనార్హం. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ప్రాణాలు కోల్పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవన్నీ ఘటనలు చూసిన తర్వాత వ్యాయామం చేస్తే ప్రాణాలు పోతాయా అనే అనుమానం అందరిలో నెలకొంది. ఇక దీనిపై వైద్యులు స్పందించి జరుగుతున్న పరిణామాలు ఏంటి ఇక ఇలా వ్యాయామం చేసిన వాళ్ళు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయాలపై ఒక నివేదిక ఇస్తేబాగుంటుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం..