డెంగ్యూ సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

Purushottham Vinay
ఈ భూమ్మీద వున్న అత్యంత ప్రమాదకరమైన ఇంకా ప్రాణాంతక వ్యాధులలో డెంగ్యూ కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డెంగ్యూ తో చాలా మంది చనిపోయిన వారు కూడా వున్నారు.దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ జ్వరం వస్తుంది.డెంగ్యూ వ్యాపించిన నాలుగు నుండి ఆరు రోజులకి లక్షణాలు కనబడతాయి. ఆ లక్షణాలు పది రోజుల పాటు ఉంటూనే ఉంటాయి అని డాక్టర్లు అంటున్నారు. హఠాత్తుగా జ్వరం ఎక్కువై పోవడం, తీవ్రమైన తలనొప్పి రావడం, కళ్ళల్లో నొప్పి కలగడం, ఎముకల నొప్పి, జాయింట్లలో నొప్పి కలగడం, నీరసం, వాంతులు, శ్వాస తీసుకో లేక పోవడం, చర్మంపై ర్యాషెస్ ఇలాంటివి రావడం, ముక్కు దంతాల నుండి రక్తం కారడం ఇటువంటి లక్షణాలు డెంగ్యూ వ్యాపించినప్పుడు కనపడతాయి.

అనేక పట్టణాల్లో ఎక్కువ కాలువలు ఉండటం వలన దోమలు ఎక్కువైతాయి. ఆ దోమల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుంది. అందువల్ల పట్టణాల్లలోనే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా వుంది అని డాక్టర్లు గుర్తించారు. ముఖ్యంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో ప్రతి సంవత్సరం కూడా డెంగ్యూతో బాధ పడే వాళ్ళు ఉంటున్నారు అని వెల్లడించారు.రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్లలో ఎక్కువ ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి సమస్య రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకోండి. జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి..

డెంగ్యూ జ్వరానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు కాబట్టి దోమలు కుట్టకుండా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. కాబట్టి మీ ఇంటి ఆవరణలో, మీ ఇంట్లో శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి.ముఖ్యంగా చిన్న పిల్లలు దోమలు కుట్టకుండా చూసుకోండి. దోమలు కుట్టడం వలన డెంగ్యూ వస్తుంది అని గుర్తించి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఇక డెంగ్యూ జ్వరం ఉంటే సింపుల్ గా పారాసిటమాల్  వేసుకోవచ్చు. దీంతో జ్వరం తగ్గుతుంది. అయితే డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు aspirin, Ibuprofen, Nemuslide, pain killers వీటిని వాడటం మంచిది కాదు. ఎందుకంటే దీని కారణంగా బ్లీడింగ్ మరింత ఎక్కువ అవుతుంది.కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ సూచనలు ప్రకారం మందులు తీసుకోండి.

ఇక మన ఇంట్లో పాత సామాన్లు ముఖ్యంగా పాత టైర్లు, క్యాన్స్, పూల కుండీలు మొదలైన వాటిలో నీళ్లు ఎక్కువగా చేరిపోతాయి. వీలైనంతవరకు పాత సామాన్లని నీళ్ళు తగలకుండా ఉంచుకోండి లేదు అంటే అక్కడ దోమలు ఎక్కువగా చేరుతాయి. దీని వల్ల మీకు ఇబ్బందులు వస్తాయి.మీ ఇంట్లో వాడే కూలర్‌లో నీళ్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ఇంట్లో పెంపుడు జంతువులకు ఉపయోగించే డిష్‌లో నీళ్లు ఎక్కువగా చేరుతాయి. వాటిని కూడా శుభ్రంగా పొడిగా ఉంచుకోవడం మంచిది. లేదు అంటే వీటి వల్ల కూడా దోమలు చేరి డెంగ్యూకి కారణమవుతాయి.ఇంట్లో మస్కిటో నెట్స్ వంటివి వాడండి. దీని వల్ల దోమలు కుట్టకుండా మీరు జాగ్రత్త పడొచ్చు.ఎక్కువ జనం ఉండే ప్రదేశాల లో ఉండటం మంచిది కాదు. మీకు వీలైతే వాళ్ల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.దోమలు కుట్టకుండా ఉండడానికి క్రీమ్ రాసుకోవడం, దోమలు మీ ఇంట్లో ఉండకుండా ఉండడానికి దోమల మందు, లిక్విడ్స్ లాంటివి వాడడం చేయండి. దీని వల్ల దోమలు మీ దరిచేరకుండా ఉంటాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: