ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల,మధుమేహం తొందరగా తగ్గుతుంది...!
ఆకుకూరలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి.దాల్చిన చెక్క ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుడ్డు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.పసుపు లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.పసుపు తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల ఏర్పడే కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.
పెరుగు కూడా షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. రోజులో పెరుగును ఎక్కువగా తీసుకోవాలి.అలాగే పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు.
మధుమేహం ఉన్నవాళ్లు కాకరకాయను తీసుకోవడం వల్ల చాలా మంచిది. కాకరకాయ రక్తంలో చక్కెర నిల్వలను పెరగకుండా నియంత్రిస్తుంది. ఎందుకంటే కాకరకాయలు ప్లాంట్ ఇన్సులిన్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒక టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని రాత్రి నాన బెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.
వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచి,డయాబెటిస్ ను కూడా నియంత్రిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో జింక్, సల్ఫర్,ఇన్సిలిన్ కాంపోనెంట్స్ ఉంటాయి.
బీన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఎక్కువసేపు ఉంటుంది.దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు, మధుమేహ వ్యాధిగ్రస్తులు బీన్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.