ఈ టిప్ పాటిస్తే కంటి చూపు రెట్టింపవుతుంది?

Purushottham Vinay
ఈ రోజుల్లో కంటి సమస్యలతో బాధపడే వారు చాలా ఎక్కువవుతున్నారు. కంటి నుండి నీళ్లు కారడం, కంటి చూపు మందగించడం, కళ్ల మంటలు ఇంకా కళ్లు మసకమసకగా కనిపించడం అలాగే కళ్ల నొప్పులు వంటి వివిధ రకాల కంటి సమస్యలతో మనలో చాలా మంది కూడా ఎంతగానో బాధపడుతున్నారు.అయితే మనకు మన ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో పొడిని తయారు చేసుకుని వాడడం వల్ల కంటి చూపును చాలా ఈజీగా మెరుగుపరుచుకోవచ్చు.ఇక ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం తెల్ల మిరియాలను, సోంపు గింజలను, బాదం పప్పును, పటిక బెల్లాన్ని ఇంకా అలాగే యాలకులను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ పదార్థాల్లో ఎన్నో పోషకాలు ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.మీరు ముందుగా ఒక గిన్నెలో 50 గ్రాముల సోంపును తీసుకోవాలి.


తరువాత ఇందులో 50 గ్రాముల బాదం పప్పు, 10 గ్రాముల తెల్ల మిరియాలు, 10 గ్రాముల యాలకులు ఇంకా అలాగే 100 గ్రాముల పటిక బెల్లాన్ని తీసుకోవాలి.తరువాత వీటన్నింటిని జార్ లో వేసి బాగా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ డోస్ లో కలపాలి. ఈ పాలను రాత్రి పడుకోవడానికి ఒక అర గంట ముందు తాగాలి. పిల్లలకు ఉదయం పూట అల్పాహారం చేసిన తరువాత ఈ పొడిని పాలల్లో కలిపి తాగించాలి. ఈ విధంగా ఈ టిప్ ని క్రమం తప్పకుండా నెల రోజుల పాటు పాటించడం వల్ల మనం చాలా ఈజీగా కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.అలాగే కంటి చూపు కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. కంటి సమస్యలని చాలా ఈజీగా దూరం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: