క్యాల్షియం పెరిగి శరీర నొప్పులు తగ్గాలంటే..?

Purushottham Vinay
ఇక మన శరీరంలో క్యాల్షియం లోపించడం వల్ల ఛాతిలో నొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడిచేటప్పుడు శబ్దాలు రావడం, తలతిరిగినట్టు ఉండడం, ఆహారాన్ని మింగడంలో ఇబ్బందులు తలెత్తడం, ఆందోళన, దంతాల నొప్పులు, అరి చేతులు ఇంకా అరికాళ్లల్లో గుచ్చినట్టు ఉండడం, చర్మం పొడి బారడం, గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలడం వంటి చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అందుకే మన శరీరంలో తగినంత క్యాల్షియం ఉండడం చాలా అవసరం. చాలా మంది క్యాల్షియం లోపాన్ని తగ్గించుకునేందుకు క్యాల్షియం క్యాప్సుల్స్ ను వాడుతూ ఉంటారు.అయితే ఇలాంటి కెమికల్స్ తో కూడిన క్యాప్సుల్స్ ను వాడే అవసరం లేకుండా కేవలం మనం తీసుకునే ఆహారాల ద్వారానే మనం ఈజీగా ఖచ్చితంగా తగినంత క్యాల్షియాన్ని పొందవచ్చు.


అందుకు మీరు ఖచ్చితంగా ప్రతి రోజూ  కూడా నానబెట్టిన బాదం పప్పును పొట్టు తీసుకుని తిని వెంటనే ఒక గ్లాస్ పాలను ఖచ్చితంగా తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఖచ్చితంగా తగినంత క్యాల్షియం అనేది లభిస్తుంది. ఇంకా అలాగే నువ్వులను పొడిగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ కూడా ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్లల్లో కలిపి తాగాలి. క్యాల్షియం లోపంతో బాధ పడేవారు లేక ఈ సమస్యతో ఎక్కువగా బాధ పడుతూ ఉన్నవారు ఈ నువ్వుల పొడిని రెండు టీ స్పూన్ల మోతాదులో ఉపయోగించాలి.ఇంకా అలాగే పాల పదార్థాలను, సోయా టోఫును, బ్రకోలిని, పాలకూరను ఇంకా అలాగే నారింజ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనం చాలా ఈజీగా క్యాల్షియం లోపాన్ని అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్ పాటించండి. క్యాల్షియం లోపాన్ని అదిగమించి శరీర నొప్పుల నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: