శరీరానికి శక్తి కావాలంటే ఏం చెయ్యాలి? ఏం తినాలి?

Purushottham Vinay
మన శరీరానికి తగినంత శక్తి కావాలంటే ఖచ్చితంగా ఎక్కువగా బలాన్ని ఇచ్చే ఆహారాలను తినాలి. పల్లీలు, పచ్చి కొబ్బరి, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, బాదం పప్పు, జీడి పప్పు, పిస్తా పప్పు ఇంకా అలాగే వాల్ నట్స్ వంటి వాటిని ప్రతి రోజూ కూడా తినాలి. వీటిని నానబెట్టి తినడం వల్ల మన శరీరానికి ఖచ్చితంగా తగినంత శక్తి లభిస్తుంది. ఇంకా అలాగే వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మనం నీరసం ఇంకా నిస్సత్తువ బారిన పడకుండా కూడా ఉంటాము.అలాగే ప్రతి రోజూ కూడా 7 నుండి 8 గంటల పాటు నిద్రించడం వల్ల కండరాలు ఇంకా అలాగే అవయవాలకు ఖచ్చితంగా తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఇలా విశ్రాంతి లభించే సమయంలోనే శరీరం తనని తాను బాగా శుభ్రపరుచుకుంటుంది. దీంతో మనం మరుసటి రోజూ చాలా ఉత్పాహంగా పని చేసుకోగలుగుతాము. ఎక్కువ సేపు నిద్రించడం వల్ల మన కండరాలు బాగా ఉత్తేజంగా ఉంటాయి.


అందుకే 8 గంటల పాటు చక్కటి విశ్రాంతి తీసుకోవడం వల్ల మనం ఎంత ఎక్కువగా పని చేసినా కానీ అలసట అనేది రాకుండా ఉంటుంది. ఇంకా అలాగే తక్కువగా నిద్రించిటప్పుడు చాలా అలసటగా ఉండడాన్ని మనలో చాలా మంది కూడా గమనించే ఉంటారు. కాబట్టి మనం ఉత్సాహంగా ఇంకా చురుకుగా పని చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం 8 గంటల పాటు నిద్ర అనేది చాలా అవసరం.ఇంకా అలాగే మన శరీరంలో ఎప్పుడు కూడా శక్తి తగ్గకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఇంకా అలాగే చాలా ఉత్సాహంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా నెగెటివ్ ఆలోచనలను పూర్తిగా మానేసి ఎల్లప్పుడూ కూడా చాలా పాజిటివ్ గా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి.ఇలా చేస్తే ఖచ్చితంగా శరీరానికి శక్తి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: