కిడ్నీ స్టోన్స్ ని ఈజీగా కరిగించి కూరగాయ ఇదే?

Purushottham Vinay
కూరగాయలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి. ఇవి మన ప్రకృతి ప్రసాదించిన అద్భుత పోషక పదార్థాలు. అందుకే మనం రోజూ తినే కూరగాయల ద్వారా మన శరీరానికి ఎనలని శక్తి వస్తుంది. మన ఆరోగ్యాన్ని జీవితకాలం కాపాడుకోవడంలో కూరగాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా మనకు రోజు తినే మునగకాయలతో కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.. సాంబార్ లో మునగ ముక్కలు చేసుకుని యాడ్ చేసుకున్నా ఇంకా టమాటాతో కూర వండుకున్నా మాములుగా ఉండదు. ఇంకా అంతే కాకుండా ఆయుర్వేదంలో కూడా మునగ గురించి బాగా ప్రస్తావించారు. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది.ఇక రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు  ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. 


మీకు కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. కిడ్నీలోని రాళ్లను కరిగించి మూత్ర ద్వారా బయటకు వెళ్లేందుకు ఇవి ఎంతగానో సహకరిస్తాయి. ఇక మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇక మునగ ఆకుతో చేసిన కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది.డయాబెటీస్ సమస్యలు ఉన్నవారికి కూడా మునగ ఆకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అందువల్ల మీకు కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.ఈ మనుగ ఆకుల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యల నుంచి మీకు చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: