పాదాల పగుళ్ల సమస్యని మాయం చేసే సూపర్ టిప్?

Purushottham Vinay
పాదాల పగుళ్ల సమస్య దాదాపు అందరికి ఉంటుంది. పాదాలు పగుళ్ళు ఏర్పడడంతో పాటు ఆ భాగంలో రంగు మారడం ఇంకా చర్మం మరింత గరుకుగా మారడం కూడా జరుగుతుంది. అలా గరుకుగా ఉన్న చర్మాన్ని మృదువుగా మార్చడానికి, పాదాల పగుళ్లను తగ్గించడానికి ఇంకా అలాగే పాదాల అడుగున ఉండే ఆనకాయల వంటి వాటిని తొలగించడానికి  పైనాపిల్‌ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా ఆమ్లా తత్వాన్ని కలిగి ఉంటుంది.ఇక పైనాపిల్‌ కు ఉండే తత్వం కారణంగానే అసిడిటి సమస్య ఉన్న వారు ఈ పండును తినడం వల్ల కడుపులో మంట వంటి ఇబ్బంది కూడా కలుగుతుంది.పాదాల పగుళ్లతో ఎక్కువగా బాధపడే వారు ఈ పైనాపిల్‌ ను వాడటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. పైనాపిల్‌ ను తీసుకొని దానిని ముక్కలుగా చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని పాదాల అడుగు భాగానికి బాగా పట్టించాలి.దీనిని ఒక 45 నిమిషాల పాటు పాదాలకు అలాగే ఉంచాలి. ఈ పైనాపిల్‌ లో ఉండే ఆమ్లాలు పాదాలపై పేరుకుపోయిన మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోయేలా చేస్తాయి.


పాదాలపై పేరుకుపోయిన మృతకణాల పొరలన్నింటిని కూడా ఈ పైనాపిల్‌ చాలా చక్కగా తొలగిపోయేలా చేస్తుంది.ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయడం వల్ల గరుకుగా ఉండే చర్మం అంతా కూడా ఈజీగా తొలగిపోయి మృదువుగా ఉండే చర్మం ఈజీగా బయటకు వస్తుంది. అందువల్ల పాదాల పగుళ్లు కూడా తగ్గుతాయి.ఇంకా అలాగే ఆనకాయలతో బాధపడే వారు కూడా ఈ టిప్ వాడడం వల్ల గట్టిగా ఉండే చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. ఈ టిప్ ని అప్పుడప్పుడూ పాటించడంతో పాటు పాదాలకు కొబ్బరి నూనె కూడా రాసుకుని బాగా మర్దనా చేయాలి. తరువాత పాదాలను బాగా శుభ్రం చేసుకునే బ్రష్ తో లేదా రాళ్లతో పాదాలను రుద్దడం వల్ల పాదాలపై మృతకణాలనేవి పేరుకుపోకుండా ఉంటుంది. ఈ టిప్ పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా న్యాచురల్ గా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చని పాదాలను మృదువుగా ఇంకా మెత్తగా మార్చుకోవచ్చని చర్మ నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: