పరగడుపున ఈ పానీయం తాగితే ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
బెల్లంను చాలా మంది తమ రోజువారీ ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. టీ, కాఫీలు ఇంకా అలాగే స్వీట్స్‌ వంటి ఇతర ఆహారాలలో బెల్లంను జోడించి నోటికి రుచిగా ఉండేలా తమదైన పద్ధతుల్లో వాడుతుంటారు.నిజానికి ఈ బెల్లంను ‘పొటాషియం స్టోర్‌హౌస్‌’ అని పిలుస్తారు. దీనితోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు ఇంకా అలాగే ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక శీతాకాలంలో ఉదయం పూట పరగడుపున వేడినీళ్లలో బెల్లం కలిపి గోరువెచ్చగా తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరానికి మంచి సహజమైన డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా అంతేకాకుండా దీనిలోని ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ పానియాన్ని గ్లాసుడు తాగారంటే బరువు ఈజీగా తగ్గుతుంది.మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బెల్లంతో తయారు చేసిన ఈ పానియాన్ని తాగవచ్చు.స్టవ్‌పై ఒక గిన్నెలో గ్లాస్‌ నీళ్లని బాగా వేడి చేయాలి. ఇంకా అలాగే అంగుళం బెల్లం ముక్కను వేసి కరిగేంత దాకా స్పూన్‌తో కలుపుకోవాలి.


ఇక ఆ తర్వాత కాస్త చల్లారనిచ్చి.. వడకట్టి వాటిని గోరువెచ్చగా తాగాలి.బెల్లం వేసిన వేడి నీళ్లను తాగడం వల్ల ఎముకలు బాగా బలపడి, కీళ్ల నొప్పులను చాలా ఈజీగా నయం చేస్తుంది. దీనిలోని పొటాషియం ఇంకా సోడియం రక్తపోటును సమతుల్యం చేస్తుంది.ఈ బెల్లానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం చాలా ఉంది. అందువల్ల కాలేయం చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని తాగితే మీ చర్మం బాగా మెరిసిపోతుంది. అలాగే బెల్లం శరీరం నుంచి హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.ఇక వారానికి రెండు లేదా మూడు సార్లు వేడి నీళ్లలో బెల్లం కులుపుకుని తాగితే బరువు క్రమంగా తగ్గిపోతుంది. అలాగే బెల్లంలోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యంగా ఉండేలా కూడా చేస్తుంది. బెల్లంలో ఉండే మెగ్నీషియం, విటమిన్ B1, B6 ఇంకా అలాగే సీ విటమిన్లు రోగనిరోధకతను పెంపొందిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఈ పానియం తాగితే అది రోగనిరోధక శక్తి పెరుగడంలో తోడ్పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: