ప్రసవం తరువాత స్త్రీలు ఖచ్చితంగా ఇవి తినాలి?

Purushottham Vinay
సరైన పోషకాహారం కనుక లేకపోతే బాలింతగా ఉన్న స్త్రీ ఖచ్చితంగా కూడా బలహీనపడవచ్చు. కాబట్టి డెలివరీ తర్వాత సరైన పోషకాహారాన్ని ఎంచుకుని తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బిడ్డకు తల్లిపాలు ఇచ్చే సమయంలో బాలింతలకు ఎనర్జీతో పాటు ఇంకా అలాగే రక్తహీనత కూడా ఏర్పడుతుంది. ఇక అలాంటి సమయంలోనే వారు ఐరన్, క్యాల్షియం, మినరల్స్ ఇంకా అలాగే విటమిన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వారి ఆరోగ్యానికి మంచిది. మరి ప్రసవం తర్వాత మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.ఇక ఆరోగ్య ఇంకా వైద్య నిపుణుల ప్రకారం డెలివరీ తర్వాత పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని మాత్రమే బాలింతలు తీసుకోవాలి. అలాంటి ఆహారాన్ని తినడం వల్ల స్త్రీల శరీరంలో విటమిన్లు, ఖనిజాలు ఇంకా ఫైబర్‌ల కొరత ఉండదు. అందుకే వారి ఆహారంలో ఈ పోషకాలు తప్పనిసరిగా ఉండాలి.


ఇక పిల్లల ప్రసవం తరువాత తల్లి శరీరం నుంచి చాలా రక్తం పోతుంది.ఫలితంగా వారికి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్త్రీలు గార్డెన్ క్రేస్ సీడ్స్, ఎండుద్రాక్ష, ఆకుకూరలు ఇంకా అలాగే ఆర్గాన్ మాంసాలను ఎక్కువగా తినాలి.అలాగే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ శిశువు మెదడు అభివృద్ధికి మాత్రమే కాకుండా,బాలింతలలో కడుపులోని మంటను కూడా ఈజీగా తగ్గిస్తుంది. ఇక ప్రసవం తర్వాత కలిగే సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్జి కోసం గుడ్లు ఉన్న చేపలు, లిన్సీడ్ ఇంకా అలాగే వాల్ నట్స్‌ను తినాలి.అలాగే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి ఇంకా బిడ్డలోని రోగనిరోధకశక్తికి చాలా మేలైనవి. అయితే బిడ్డకు పాలు తాగించే స్త్రీలలో అయోడిన్ అనేది సరిపడినంత పరిమాణంలో ఉండదు. థైరాయిడ్ పనితీరుతో పాటు తల్లిబిడ్డల మెదడు అభివృద్ధిలో కూడా అయోడిన్ సహాయపడుతుంది. దీని కోసం ఉప్పుచేపలు, పాలు, పెరుగు ఇంకా జున్ను తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: