ఆకలితో.. భారత్ 106వ స్థానం.. !

Chandrasekhar Reddy
ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాలలో భారత్ ఒకటిగా ఇప్పటికి ఉంటోంది. ఈ విషయంలో దాయాది దేశాల కంటే భారత్ వెనక ఉండటం జరిగింది. ఈ సమస్య తీవ్రంగా ఉన్న పావువా న్యూ గినియా(102), ఆఫ్ఘనిస్తాన్(103), నైజీరియా(103) సరసన భారత్ కూడా చేరింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలు ఉండగా అందులో భారత్ 101 స్థానంలో ఉంది. గతంలో 107 దేశాలలో భారత్ స్థాయి 94గా ఉంది. ఇప్పుడు ఇంకా దిగజారింది అని తెలుస్తుంది. దానికి కారణం కరోనా అయిఉండవచ్చు. ఏదిఏమైనా భారత్ కూడా ఈ స్థితి నుండి కోలుకోవాల్సిన అత్యవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ జాబితాలో తరువాతి స్థానాలలో కాంగో 105, మొజాంబిక్, సియర్రా లియోన్ 106, తిమోర్ లెసై 108, హైతీ 109, లిబియా 110, మడగాస్కర్ 111, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగో 112, చాద్ 113, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్ 114, యెమన్ 115, సోమాలియా 116 స్థానాలలో ఉన్నాయి. భారత్ తో పోలిస్తే పాకిస్తాన్ 92, నేపాల్, బంగ్లాదేశ్ 76 స్థానాలలో కాస్త మెరుగ్గానే ఉన్నాయి. అయితే ఈ అధ్యయనం కేవలం 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో కూడా ఎక్కడ ఆకలి బాధలు లేకుండా చేయడానికి వీలు అవుతుందా లేదా అనేది తెలుసుకునేందుకు చేశారు.  
అయితే దీనిని బట్టి 2030 నాటికీ 47దేశాలలో ఆకలి లేని సమాజాన్ని తీసుకురావడం సాధ్యం అయ్యే పని కాదని అధ్యయన కారులు అంటున్నారు. ఇక్కడ వారికి పౌష్టికాహార లోపం, పిల్లలలో వయసు తగ్గ బడుగు లేకపోవడం, ఎత్తు లేకపోవడం అలాగే ఆకలితో చనిపోవడం లాంటివి సంభవించే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు వారు. అయితే ఈ జాబితా 100 పాయింట్ల ర్యాంకింగ్ ద్వారా తయారు చేశారు.  అంటే జీరో వచ్చిన వారి దేశంలో ఆకలి బాధలు లేవని, 100 ర్యాంకు వచ్చిన వారి దేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా 20.4 గా ఉన్న ఈ స్థితి ఒక్కసారిగా 25.1 శాతానికి పడిపోయిందని వారు తెలిపారు. ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపం ఉందని, దీనివలన మిగితావి తయారవుతాయని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: