వర్షాకాలంలో వీటిని అస్సలు తినకండి.. !

MADDIBOINA AJAY KUMAR
సాధారణంగా సీజన్ మారినప్పుడు అందరికి హెల్త్ ఇష్యుస్ వస్తుంటాయి. అందులోను వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధుల బారిన పడుతుంటారు. వర్షాకాలంలో దోమలు కూడా ఎక్కువ ఉండటం వల్ల వైరల్ ఫీవర్స్, మలేరియా, డెంగ్యు వంటివి మరియు దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటివి కూడా ఎక్కువగా బాధిస్తుంటాయి. అందుకే వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. అయితే ఈ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను దూరం పెట్టాలి అవేంటో చూద్దాం.
కరోనా కాలంలో ఏవైనా సీజనల్ వ్యాధులు బారిన పడితే చాలా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఆహారాన్ని మితంగా తీసుకుని కొన్ని ఆహారాలను ఎవైడ్ చేయడం ఎంతో ఉత్తమం. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్స్ వర్షాకాలంలో పూర్తిగా తగ్గించాలి. ఆకుకూరలు కూడా వర్షాకాలంలో పక్కన పెట్టడమే మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో ఆకు కూరలపై బ్యాక్టీరియా ఉంటుంది. అవి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడుతుంది. బచ్చలి, మెంతి కూర, పాల కూర, మష్రూమ్స్, కాలి ఫ్లవర్, బ్రకోలి వంటి కూరగాయలు కూడా ఈ మాన్సూన్ లో ఎవైడ్ చేస్తే మంచిది.
వర్షాకాలంలో సలాడ్స్ కూడా తగ్గించాలి. మాన్సూన్ లో జీర్ణ క్రియ కొంచెం తక్కువగా పనిచేస్తుంది. దీనితో పచ్చి కూరగాయలు తినడం వలన అవి సరిగా జీర్ణం అవక కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. పచ్చి కూరగాయలు లో ఉండే బ్యాక్టీరియా వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాక ఈ రోజుల్లో సీ ఫుడ్స్ అంటే చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాన్ని కూడా తీసుకోకూడదు. వర్షాల కారణంగా నీరు కలుషితం గా ఉంటుంది. కనుక ఈ సమయంలో చేపలు తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: