బ్యాడ్ న్యూస్..పరుగులు పెడుతున్న పసిడి..వెండి ఇలా..!
ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 48,550కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 52, 960కి చేరింది. మరోవైపు వెండి ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారంతో పోటీ పడుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.52,960 కి ఎగబాకింది. చెన్నైలో బంగారం గరిష్ట ధరలు నమోదు చేసింది.
రూ.520 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,970 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,420 తో దేశంలోనే భారీ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,550 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,960కి చేరింది.కిలో వెండి ధర రూ. 200 కి పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.69,200 గా నమోదు అయింది..ఇకపోతే బంగారం ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో గోల్డ్ డిమాండ్ పెరగడం వంటి వాటి వల్ల పసిడి ధరలు పుంజుకుంటున్నాయి.మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..