హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయడం 50 రోజుల్లో మొదటి దశ ఇంప్లిమెంటేషన్ పూర్తి కానుంది. హాల్ మార్కింగ్ అనేది గోల్డ్ ప్యూరిటీ సర్టిఫికెట్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బంగారం ప్యూరిటీనీ నిర్ధారిస్తుంది. గతంలో ఇది స్వచ్ఛందంగా ఉండేది. కానీ గోల్డ్ కొనుగోలుదారులు మోసపోవద్దని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మరిన్ని హాల్ మార్కింగ్ సెంటర్స్ తేవాలని నిర్ణయించింది. జువెలర్స్ తమ బంగారానికి హాల్ మార్కింగ్ చేయించాలని గతంలో రెండు సార్లు డెడ్లైన్ విధించింది. కానీ కరోనా కారణంగా ఆ విషయాన్ని పక్కకు పెట్టింది.
న్యూ రూల్స్ ప్రకారం గోల్డ్ పై పై హాల్ మార్కింగ్, ప్రిషియస్ మెటల్ పై సర్టిఫికెట్ వంటి నిబంధనలు వచ్చే ఏడాది జూన్ 16 నుంచి మొదటి దశ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా అమలు కానున్నాయి. దీనికోసం 28 రాష్ట్రాల నుంచి 256 జిల్లాలలో హాల్ మార్కింగ్ సెంటర్లను నిర్వహించబోతోంది. జువెలర్స్ ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే వారు అమ్మిన జ్యువెలరీ విలువకు ఐదు రెట్లు ఎక్కువగా ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. లేదా ఏడాదిపాటు జైలు కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,270 ఉంది. కేజీ వెండి ధర రూ.66,700 కు చేరుకుంది.