పెరిగిన బంగారం ధరలు.. తగ్గుముఖం పట్టిన వెండి..!
గత కొద్ది రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతున్నాయి. ధర సెప్టెంబర్ 4-14వ తేదీ వరకూ స్వల్పంగా పెరిగింది. నిన్న ధర భారీ స్థాయిలో పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు చేదువార్త అనే చెప్పుకోవచ్చు. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,960, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,380కి చేరింది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగాయి. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,340కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.51,340 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.53,570, 22 క్యారెట్ల ధర రూ.49,110కి చేరింది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,710. 24 క్యారెట్ల ధర రూ.52,050 గా ఉంది.
దేశీయ మార్కెట్ లో పసిడి ధర పెరిగినా వెండి ధర కూడా తగ్గు ముఖం పట్టింది. మార్కెట్ కేజీ వెండి ధర రూ.67,900కి చేరింది. భారత దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో పసిడి ధర పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరగడంతో ధర రూ.54,990కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరగడంతో రూ.50.410కి చేరింది. రాజధానిలో కూడా వెండి ధర స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.67,900గా ఉంది.