బంగారం: షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. వెండి మాత్రం?

Durga Writes

బంగారం తగ్గుదలకు నేడు బ్రేకులు పడ్డాయి... బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కారణంగా బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపించాయి. బంగారంతో పాటు ముడి చమురు ధరలు కూడా ఆకాశానికంటుతున్నాయి. ఇంకా డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలహీనపడుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు భారీగా తగ్గాయి. 

 

ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 130 రూపాయిల పెరుగుదలతో 41,610 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల పెరుగుదలతో 38,150 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 49,600 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతో బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్ భారీగా పెరగడంతో బంగారం ధరలు పెరిగాయి. సామాన్యులకు అందనంత దూరంలో ప్రస్తుతం బంగారం ధరలు చేరాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: