కేంద్రీయ విద్యాలయాల్లో భారీ నోటిఫికేషన్.. "8339 ఉద్యోగాలు"
న్యూఢిల్లీలోని భారత మానవ వనరుల అభివృద్ధి
మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంగఠన్.. దేశంలోని వివిధ కేంద్రీయ
విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 8339 ప్రిన్సిపల్, పీజీటీ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...ఆన్లైన్
ద్వారా ఈ ధరఖస్తులని కోరుతున్నారు.
విభాగాల వారీ ఖాళీలు:
ప్రిన్సిపల్ : 76
వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి 35-50 ఏళ్ల మధ్య ఉండాలి.
వైస్ ప్రిన్సిపల్ : 220
వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్
టీచర్లు (పీజీటీ) : 592
వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 40 ఏళ్లు ఉండాలి.
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్
టీచర్లు (టీజీటీ) : 1900
వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి.
లైబ్రేరియన్ : 50
వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 35 ఏళ్లు ఉండాలి.
ప్రైమరీ టీచర్లు : 5300
వయసు: 2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి.
ప్రైమరీ టీచర్లు (మ్యూజిక్)
: 201
వయసు:2018, సెప్టెంబర్ 30 నాటికి గరిష్ట వయసు 30 ఏళ్లు ఉండాలి. అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం. వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఎంపిక: రిక్రూట్మెంట్
టెస్ట్ ఆధారంగా. టెస్ట్ ఆఫ్లైన్లో ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ప్రారంభతేదీ: ఆగస్టు 24, 2018.
దరఖాస్తు చివరితేదీ: సెప్టెంబర్ 13, 2018.
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: https://kvsangathan.nic.in