ఏపీ: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పబ్లిక్ పరీక్షల తేదీలివే..!

frame ఏపీ: పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. పబ్లిక్ పరీక్షల తేదీలివే..!

Divya
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.. 2024-2025  విద్యా సంవత్సరానికి గాను పబ్లిక్ పరీక్షల టైమ్ టేబుల్ ని కూడా రిలీజ్ చేశారు. మార్చి నెలలోనే పదవ తరగతి మెయిన్ పరీక్షలు మొదలు కాబోతున్నాయట. మార్చి 17వ తేదీ నుంచి పరీక్షలు మొదలయ్యి మార్చి 31 లేదా ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తెలియజేసింది. ఇక పరీక్షల సమయం విషయానికి వస్తే ఉదయం 9:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు జరుగుతాయట.

అలాగే ఫిజికల్ సైన్స్ బయోజికల్స్ సైన్స్ వంటి సబ్జెక్టులకు మాత్రమే టైమింగ్ లో స్వల్ప మార్పులను చేశారు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 నిమిషాల వరకు మాత్రమే సమయం ఉంటుందట మిగతా అన్ని సబ్జెక్టులకు యధావిధిగాని సమయాన్ని కొనసాగిస్తామంటూ విద్యాశాఖ తెలియజేశారు. అయితే పరీక్ష షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పరీక్షలు జరగబోయే తేదీలను కూడా ప్రకటించడం జరిగింది.

1). మార్చి 17-2025 :రోజు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ పరీక్ష జరుగుతుంది.
2). మార్చి-19 -2025 :సెకండ్ లాంగ్వేజ్.
3). మార్చి 21-2025: ఇంగ్లీష్ పరీక్ష.
4). మార్చి 22-2015 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2,Ossc మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష జరుగుతుందట.
5). మార్చి 24-2025: మ్యాథమెటిక్స్
6). మార్చి 26-2025: ఫిజికల్ సైన్స్
7). మార్చి 29-2025:OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2, ఎస్ఎస్సి ఒకేషనల్ కోర్సు కు సంబంధించి ఎగ్జామ్ ఉంటుందట.
8). మార్చి 31 లేదా ఏప్రిల్ ఒకటవ తారీఖున సోషల్ స్టడీ పరీక్ష ఉంటుందట.

అయితే ప్రభుత్వ క్యాలండర్ ప్రకారం మార్చి 31న రంజాన్ కావడం చేత ఆ రోజు సెలవు ఉంటే ఏప్రిల్ -1 వ తారీఖున ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుందట. లేకపోతే 31వ తారీకున జరుగుతుందట
 మరి అప్పటి పరిస్థితులను పట్టి ఎప్పుడు అనే విషయాన్ని తెలియజేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: