అమ్మఒడి: విద్యార్థులకు జగన్ నుంచి మరో శుభవార్త?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన 4వ విడత నగదు రేపు అనగా ఆదివారం నాడు తల్లుల ఖాతాలో జమ కానున్నాయి. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఇక అక్కడ జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి జేవీడీకి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు. నిజానికి శనివారమే తల్లుల ఖాతాలో ఈ నగదు జమ కావల్సిఉంది. అయితే తిరువూరులోని ముఖ్యమంత్రి సభా వేదికకు పక్కనే ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ పరీక్షలనేవి జరుగుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని అదివారానికి వాయిదా వేశారు.అయితే ఈ విషయం గురించి శనివారం నాడు మాట్లాడిన మాజీ మంత్రి ఇంకా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్..'రేపు తిరువూరులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు.


జగనన్న విద్యాదీవెన 4వ విడత కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. గతకాలంలో పేదవిద్యార్థులకు ఉన్నత చదువు అనేది చాలా భారంగా మారింది. ప్రభుత్వ విద్యను చంద్రబాబు నాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల బలోపేతం చేసే దిశగా బాబు పనిచేశారు. కానీ, వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చదువుల్లో విప్లవం తెచ్చారు. ప్రతీ ఒక్కరూ కూడా చదువుకోవాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆయన చాలా బాగా తీర్చిదిద్దారు.చంద్రబాబు నాయుడు కేవలం 16 లక్షలు మందికి ఫీజులరీయింబర్స్ మెంట్ ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ మూడేళ్లలో మొత్తం 31.4 లక్షల మందికి జగనన్న విద్యాదీవెన చేరువ చేశారు. రేపు 11 లక్షల మందికి 700 కోట్ల రూపాయలని ఆయన అందించనున్నారు. చదువు ద్వారానే అన్నీ సాధ్యమని నమ్మిన వ్యక్తి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే విద్యకు ఆయన పెద్దపీట వేశార'ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: