ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రతి వారం జాబ్ మేళా!

Purushottham Vinay
ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. దేశంలో చదువుకొని ఖాళీగా ఉంటున్న ఉద్యోగాలు చాలా ఎక్కువ అయిపోయారు. ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు తమ చదువులు పూర్తి చేసుకోని కాలేజీల నుంచి బయటకి వస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిరుద్యోగులు చాలా ఎక్కువైపోయారు.ఇక ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చక్కటి గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం నాడు ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్‌ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఇంకా సీఈవో సత్యనారాయణ తెలిపారు.ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన జాబ్‌ మేళా క్యాలెండర్‌ను విడుదల చేయడం జరిగింది.ఇంకా స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంలో భాగంగా వచ్చే 12 నెలల కాలంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 312 జాబ్‌ మేళాలు నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్ డీసీ ప్రకటించింది.


ఈ ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రతి మంగళవారం నాడు ప్లేస్‌మెంట్‌ డే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంకా అలాగే నిరుద్యోగులకు రాష్ట్రంలో స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించే విధంగా మొత్తం 262 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. ఇక ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ అజయ్‌రెడ్డి చెప్పారు.ఇంకా అలాగే గడిచిన మూడేళ్లలో మొత్తం 14 లక్షల మందికి ఆన్‌లైన్ ఇంకా అలాగే ఆఫ్‌లైన్‌ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు ఏపీఎస్‌ఎస్‌డీసీ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి చెప్పారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గం పరిధిలో స్కిల్‌ హబ్స్‌ ప్రారంభిస్తున్నామన్నారు. ఇక ఇందులో భాగంగా తొలి విడతలో 66 హబ్స్‌ను ఆగస్టు 15 వ తేదీన అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: