టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు మరో గుడ్ న్యూస్!

Purushottham Vinay
ఇక ఏపీలో పదో తరగతి పరీక్షలు మొదలుకావడం నుంచి రిజల్ట్స్ తరువాత సైతం పరిస్దితులు అనేవి రోజురోజుకు మారిపోతున్నాయి. ఏపీ టెన్త్ ఫలితాల్లో కేవలం 67 శాతం మాత్రమే విద్యార్థులు పాసయ్యారు.అయితే విద్యార్థులు ఇంకా వారి తల్లిదండ్రులు మాత్రం ఎలాంటి సప్లిమెంటరీ పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని ప్రభుత్వాన్ని బాగా డిమాండ్ చేశారు. ఫీజులు కట్టించుకోకుండా సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను అనుమతించాలని కోరిన నేపథ్యంలో టెన్త్ ఫెయిన్ అయిన విద్యార్థులకు ప్రభుత్వం ఇక మంచి శుభవార్త అందించింది. టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు కట్టకున్నా కూడా హాల్ టికెట్స్ జారీ చేయనున్నారు.ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి  అసలు కట్టనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి .వి.నారాయణ రెడ్డి ఇంకా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు వెల్లడించారు.అలాగే సప్లిమెంటరీ పరీక్షలకు చెల్లించాల్సిన ఫీజులపై విద్యార్థులు ఆందోళన చెందనవసరం లేదని కూడా వెల్లడించారు. ఇక ప్రస్తుతానికి విద్యార్థుల వద్ద నుంచి వసూలు చేసిన ఫీజును కూడా ప్రధానోపాధ్యాయుల వద్దనే ఉంచుకోవాలని వారికి సూచించారు. ప్రభుత్వం సప్లమెంటరీ పరీక్ష ఫీజును 500 ఇంకా అలాగే రీవెరిఫికేషన్ కు వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది. జూలై 6 నుంచి జూలై 15 వరకు కూడా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స ఫలితాలు వచ్చిన రోజు తెలిపారు.


ఇక కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఏపీ ప్రభుత్వం టెన్త్ ఇంకా ఇంటర్ పాస్ చేస్తూ వస్తోంది. గత విద్యా సంవత్సరంలో కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో తరగతులు కొన్ని నెలలు నిర్వహించారు. విద్యార్థులకు సిలబస్ తగ్గింపు ఇంకా పేపర్లు తగ్గింపు లాంటి ఊరట కలిగించే ఎన్నో నిర్ణయాలను కూడా ఏపీ విద్యాశాఖ తీసుకుంది. రెండేళ్ల అనంతరం గతంలో నిర్వహించినట్లు ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు. కానీ ఈ సారి ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య పరీక్షలు అనేవి నిర్వహించాల్సి వచ్చింది. ఉత్తీర్ణత శాతం కూడా చాలా తగ్గడంతో ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యాన్ని చేసుకుని విమర్శలు గుప్పించాయి. అయితే విద్యార్థులు సొంతంగా పాస్ కావాలని ఇంకా ప్రభుత్వం నేరుగా పాస్ చేస్తే వారి జీవితాలను నాశనం చేయడం అవుతుందని భావించారు. మార్కులు కలపడం ఉండదని, ఖచ్చితంగా సప్లిమెంటరీ రాసి పాస్ కావాలని విద్యార్థులకు సీఎం జగన్ సైతం సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: