భారతీయ రైల్వేలో ఖాళీలు ఉన్న టీచర్ పోస్ట్ వివరాలు ఇవే..

Satvika
నిరుద్యోగులకు భారతీయ ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. దేశ వ్యాప్తంగా ఖాళీలు ఉన్న పోస్టులకు సంబంధించిన వివరాలను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పలు నోటిఫికేషన్లను విడుదల చేశారు. పలు విభాగాల్లో పరీక్షలను కూడా నిర్వహించారు. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.భారతీయ రైల్వేలో క్లర్క్, టికెట్ కలెక్టర్, లోకో పైలట్ లాంటి పోస్టులతో పాటు రైల్వేకు చెందిన విద్యా సంస్థల్లో టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. భారతీయ రైల్వేకు చెందిన రైల్వే జోన్స్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశారు.


వివరాల్లోకి వెళితే.. వెస్ట్ సెంట్రల్ రైల్వే ప్రైమరీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరం కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత https://wcr.indianrailways.gov.in/ వెబ్ సైట్ పొందుపరిచారు.



ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన టీచర్లు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి ఖాళీలను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు లను నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్ అడ్రస్‌కు చివరి తేదీలోగా మెయిల్ పంపాలి.

ఇకపోతే దరఖాస్తుకు చివరి తేదీ-  ఫిబ్రవరి 15 -2021
విద్యార్హతలు- ప్రైమరీ టీచర్.. పోస్టుకు 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ, రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. 


ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు గ్రాడ్యుయేషన్‌తో పాటు బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ పాస్ కావాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు పాస్ కావాలి.


వయస్సు- 18 నుంచి 65 ఏళ్లు.


ఎంపిక విధానం- దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ


వేతనం..


ప్రైమరీ టీచర్- పోస్టుకు రూ.21,250, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు రూ.26,250, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- పోస్టుకు రూ.27,500


వీటితో పాటుగా మరి కొన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: