ఇక ఊరుకోను.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్య రంగాలకు పాలసీలు రూపొందించామని తెలిపారు. రెండేళ్లలో పలు విజయాలు సాధించి ప్రణాళికలు అమలు చేశామని పేర్కొన్నారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక ఊరుకోనని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో అధికారులు సమన్వయం పెంచుకోవాలని సూచించారు.రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేసి రాష్ట్రాన్ని క్యూర్ ప్యూర్ రేర్ జోన్లుగా విభజించామని చెప్పారు. ఈ ఫ్రేమ్వర్క్ ఆధారంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
స్పష్టమైన విధివిధానాలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గత పాలనలో లోపాలు సరిచేసి మెరుగైన ఫలితాలు తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. అధికారులు గొప్ప కార్యాచరణకు సహకరించాలని కోరారు. ప్రతి నెలా కార్యదర్శులు సీఎస్కు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. సీఎస్ ప్రతి నెలా వారి పనితీరును సమీక్షిస్తారని చెప్పారు. ప్రతి మూడు నెలలకు తానే సమీక్షలు నిర్వహిస్తానని హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమాలలో సమన్వయం కీలకమని ఆయన ఒప్పుకున్నారు. ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మెకానిజం ఏర్పాటు చేయాలని సూచించారు.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు