ఆ ఇద్దరు అధికారులపై చంద్రబాబుకు వల్లమాలిన ప్రేమ.. అందుకే ఈ ఛాన్స్?
ఈ నిర్ణయం వెనుక చంద్రబాబుకు విజయానంద్పై ఉన్న అత్యంత విశ్వాసమే కారణమని అమరావతి వర్గాలు చర్చించుకుంటున్నాయి.మూడు నెలల తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ను చీఫ్ సెక్రటరీగా నియమించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాయి ప్రసాద్ పదవీ కాలం 2026 మేలో ముగియనుండగా, ఆ తర్వాత కూడా ఆయన్ను సీఎస్గా కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ విషయంపై ఇద్దరు అధికారులకు ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి అనధికారిక సమాచారం అందినట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.చంద్రబాబు గతంలోనూ తనకు నచ్చిన అధికారులకు పదవీ కాలం ముగిసినా పొడిగింపులు ఇవ్వడం అసాధారణం కాదు. ప్రస్తుతం రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఆర్థిక పునరుజ్జీవనం వంటి కీలక అంశాల్లో విజయానంద్, సాయి ప్రసాద్ల పాత్ర కీలకంగా ఉండటమే ఈ ప్రత్యేక పరిగణనకు మూలం.
ఈ నిర్ణయం బ్యూరోక్రసీలో కొత్త చర్చను రేకెత్తించినప్పటికీ, ప్రభుత్వ పనితీరుకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.రాష్ట్రంలో పరిపాలనా స్థిరత్వం, అభివృద్ధి వేగం కోసం అనుభవజ్ఞులైన అధికారులను కొనసాగించాలన్న చంద్రబాబు వ్యూహం స్పష్టమవుతోంది. ఈ రెండు పొడిగింపులు రానున్న రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీలో ఈ ఇద్దరు అధికారులదే ఆధిపత్యం కొనసాగనుందని నిర్ధారిస్తోంది.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు