బీజేపీపై స్టాలిన్ శివతాండవం.. కరూర్ ఓకే.. మణిపూర్ సంగతేంటి..?
ఈ సంఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటుందని, దోషులను కఠినంగా శిక్షిస్తామని స్టాలిన్ హామీ ఇచ్చారు. స్టాలిన్ తన విమర్శలను మణిపూర్ వైపు మళ్లించి, బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. మణిపూర్లో గత రెండేళ్లుగా అల్లర్లు, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, అక్కడ బీజేపీ ఎంపీలు ఎందుకు సందర్శనకు వెళ్లలేదని ఆయన సూటిగా అడిగారు. మణిపూర్లో 200 మందికి పైగా మరణించారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారని, అయినప్పటికీ కేంద్రం నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ రాజకీయ లాభం కోసం కరూర్ను ఉపయోగించుకుంటూ, మణిపూర్ సంక్షోభాన్ని పట్టించుకోకపోవడం ద్వంద్వ విధానమని స్టాలిన్ ఆరోపించారు. కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం విచారణ బృందాన్ని నియమించింది. స్థానిక నాయకులు, పోలీసు అధికారులు శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. స్టాలిన్, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని బీజేపీని హెచ్చరించారు, రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలను సహించమని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం ఈ సంఘటనలో న్యాయం చేస్తుందని, బాధితులకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు