రేవంత్ ఉండగా.. తెలంగాణలో చంద్రబాబు హెరిటేజ్ కి తిరుగులేదా?

గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రేవంత్రెడ్డి సీఎం అయ్యారు. ఇక అటు ఏపీలోను జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు-పవన్ కల్యాణ్-బీజేపీ కలయికతో ఏర్పడిన కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. అటు రేవంత్.. ఇటు చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఒక సెక్షన్ పైకి లేస్తోంది.


పెట్టుబడులు.. కంపెనీలు.. ప్రభుత్వ భూములు.. ఇలా రకరకాల వ్యవహారాలు సాగుతున్నాయి. రేవంత్ ఒకప్పటి టీడీపీ కాంపౌండ్ ఎమ్మెల్యే. చంద్రబాబుకి అత్యంత ఇష్టమైన నాయకుడు. పైగా వారిద్దరి మధ్య విభేదాలు ఎన్నడూ లేవు. ఇటీవల రేవంత్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. విభజన సమస్యలపై మాట్లాడుకున్నారు.


పరస్పరం ఒక అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇదేం చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ జమానా కాదు కాబట్టి.. పెద్దగా రెండు రాష్ట్రాలు మధ్య తగాదాలు లేవు. తగవులు అంతకన్నా లేవు. బట్టర్ అండ్ బ్రెడ్ లాగా సాగిపోతుంది.


రేవంత్ తెలంగాణ సీఎంగా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు కుటుంబ సభ్యుల కంపెనీ హెరిటేజ్ విస్తరణను కొనసాగిస్తోంది. గతంలో వారికి ప్రణాళికలు ఉన్నప్పటికీ.. ఎందుకనో వాటిని ఆశించిన స్థాయిలో అమల్లో పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎలాగూ రేవంత్ అనుకూలమైన వ్యక్తి కాబట్టి విస్తరణకు రూపొందించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్ంన షామీర్ పేట ప్రాంతంలో రూ.204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ ఐస్ క్రీం ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబధించి ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది నవంబరు ప్లాంట్ ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐస్ క్రీం కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో ఈ యూనిట్ నెలకొల్పామని హెరిటేజ్ చెబుతోంది. ఈ ప్లాంట్ నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పర్యవేక్షిస్తున్నారు. అయితే బీఆర్ఎస్, వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎదురుదాడి మొదలు పెట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: