కేసీఆర్ చెప్పింది నిజమే.. తెలంగాణ ధనిక రాష్ట్రమే! మరి ఏపీ సంగతేంటి?

పదేళ్ల తెలంగాణ దేశానికి తలసిరిగా నిలుస్తోంది. ధనిక రాష్ట్రం అనే బిరుదును సాకారం చేసుకుంటూ.. అద్భుత ప్రగతిని సాధిస్తోంది. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాలనే తలదన్నుతోంది. వరుసగా రెండో ఏడాది కూడా అత్యధిక తలసరి ఆదాయంలో రెండో రాష్ట్రంగా నిలిచింది.


తెలంగాణ కంటే ముందు దిల్లీ ఉంది. దేశానికి రాజధాని అయిన దిల్లీకి కొన్ని ప్రత్యేకతలుంటాయి. దానిని కూడా మినహాయించి  చూస్తే తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ వన్ అనడంలో  సందేహం లేదు. తెలంగాణ ఏర్పాటైంది 2014. అంటే ఇప్పటికి పదేళ్లకు కొద్దిగా ఎక్కువ. కానీ దేశ తలసరి ఆదాయంలో రెండో స్థానానికి చేరింది. నిరుడు కూడా ఈ విషయంలో మెరుగైన పనితీరునే కనబరిచింది. ఇక భారతదేశ స్థూల దేశీయోత్పత్తి జీడీపీ కూడా తెలంగాణ గణనీయమైన సహకారం అందిస్తోంది.


ఇదేదో సర్వే సంస్థ చెబుతున్న మాట కాదు. ఇటీవల ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన అధికారిక పత్రం. కాగా దీని ప్రకారం. తెలంగాణ పర్ క్యాపిటా తలసరి ఆదాయం 193.6 శాతం. కేవలం దల్లీ మాత్రమే 200కి పైగా తలసరి ఆదాయం దాటింది. దేశ రాజధాని పర్ క్యాపిటా 250.8 శాతం కావడం విశేషం.


వాస్తవానికి 1991లో దక్షిణ భారత రాష్ట్రాలు జాతీయ సగటు కంటే  తక్కువగా ఉండేవి. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మూడు ఇప్పుడు టాప్-5  సంపన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాలు 30శాతం వీటిదే. టెక్నాలజీలో కర్ణాటక, ఆటో మొబైల్ రంగంలో తమిళనాడు ప్రగతి వాటిని మెరుగైన పర్ క్యాపిటా లో నిలుపుతోంది. అయితే వీటికంటే చాలా చిన్నదైన పదేళ్ల వయసున్న తెలంగాణ వీటిని అధిగమించడం విశేషం.


ఏపీ జీడీపీ పరంగా దేశంలో తొమ్మిదో స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో 16వ స్థానంలో నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ వంటి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రాజధాని ఏపీకి లేకపోవడమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: