మోదీకి జగన్‌ ఆ లెక్కలు చెబుతున్నారా?

జర్నలిజం ముసుగులో ఏది రాసినా ప్రజలు నమ్మేస్తారు అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకంటే పార్టీకొక మీడియా ఉంది. ఒకరు అవునంటే మరొకరు కాదంటారు. ఏది వాస్తవమో తెలియక ప్రజలు రెండింటిని పక్కన పెట్టేస్తున్నారు. ఏపీ విషయానికొస్తే జగన్ ఏదీ చేసినా తప్పే. అదే చంద్రబాబు ఏం చేసినా ప్రజల కోసమే అనే రీతిలో ఎల్లో మీడియా వార్తలు ప్రచురిస్తోంది. నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో వైసీపీ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఆ  పథకం.. ఈ పథకం అంటూ శాఖలకు చెందిన నిధులను ఇష్టా రాజ్యంగా మళ్లిస్తోంది.


ముఖ్యంగా ఆరోగ్య శాఖకు చెందిన నిధులు అయితే ప్రభుత్వం తన అవసరాలకు వాడుకొని ఆ తర్వాత తనకు నచ్చినప్పుడు నిధులు ఇస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వాడుకోవడం పరిపాటిగా మారింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. సర్వశిక్షా అభియాన్ లో వచ్చిన నిధులను నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.  అదే చంద్రబాబు హయాంలో వాటిని పాఠశాలలకు జీతాలు కింద ఇచ్చారు. అలాగే పసుపు కుంకమ పథకం కింద అన్ని కార్పొరేషన్ నుంచి బీసీ, ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా నిధులను సేకరించి ఆ పథకానికి వెచ్చించారు.  అంటే చంద్రబాబు చేస్తే కరెక్టు. జగన్ చేస్తే పెద్ద తప్పు.


11 మెడికల్ కళాశాలల్లో కొత్త మెడికల్ సీట్ల కోసం రాష్ట్రం కేంద్రానికి డీపీఆర్ లు అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు  విషయంలో కేంద్రం డీపీఆర్ లు అడిగితే నాకు తెలియదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి రచ్చ రచ్చ రచ్చ చేశారు. డీపీఆర్ లు పరిశీలించిన కేంద్రం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులు సక్రమంగా ఖర్చు చేశారు అని చెప్పడానికి కేంద్రానికి యూసీలు అందించాలి. వాటిని జగన్  ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. అంటే ప్రభుత్వం బాధ్యతగానే ఉంది. కానీ ఎల్లో మీడియానే వక్రీకరంచి వార్తలు రాస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: