కోడి కత్తి వర్సెస్‌ జైలు దోమ.. ఏది ప్రమాదం?

జగన్ అక్రమాస్తుల కేసుల విషయంలో ఏవైతే తప్పు అని చెప్పారో నేడు అవే విషయాలో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జరిగితే తప్పు కాదని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. ముఖ్యంగా నాడు జగన్ కేసుల్లో ఏవైతే నేరస్థులు అని ప్రకటించారో అదే విధంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కంపెనీలకు పేవర్ చేశారని అది తప్పని వాదించారు. ప్రస్తుతం స్కిల్ కేసులో అదే విధానం లో చంద్రబాబు సిమెన్స్ అనే పేరుతో షెల్ కంపెనీలకు డబ్బులు తరలించారని తెలుస్తోంది. అయితే ఇది తప్పు కాదని టీడీపీ నాయకులు, అనుకూల మీడియా వాదిస్తోంది.

ప్రస్తుతం చంద్రబాబు అరెస్టయి రాజమండ్రిలో జైల్లో ఉన్నారు. అయితే దీనిపై ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం జైల్లో దోమలను విడిచిపెడుతున్నారని ఆయనకు విపరీతమైన దోమలు కుట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని డెంగీతో జైల్లో ఒక ఖైదీ చనిపోయారని వాదిస్తున్నారు..

అయితే ఈ విషయంలో సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక కామెంట్ చేశారు. ఆనాడు కోడికత్తితో కోస్తే చనిపోతారా? కోడి కత్తితో ఊళ్లో ఎంతో మంది వాడుతుంటారు. దానితో పెద్ద సీన్ క్రియేట్ చేశారు. కోడి కత్తితో ప్రాణాలు పోతాయా అని వాదించిన వారు. నేడు దోమలు కుడితేనే ప్రాణాలు పోతాయా? దోమలతో ఇబ్బందులు తలెత్తుతాయా? దోమలు కుడితేనే ఇంత ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదని కౌంటర్ ఇచ్చారు.

కర్మ ఇస్ బ్యాక్ అన్నట్లు ఆనాడు జగన్ విషయంలో కోడి కత్తి కేసులో చీప్ గా మాట్లాడిన వారు.. నేడు దోమల విషయంలో ఎందుకు అంతా ఆరాటపడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు బయటకు వచ్చే దాకా అనుకూల మీడియా టీడీపీ నేతలు ప్రతి విషయాన్ని వివాదం చేయాలని భావిస్తూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: