పవన్‌ కల్యాణ్‌పై అభిమానంతో ఉద్యోగం ఊడింది?

మన పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత పరిశుభ్రత అనే కాన్సెప్ట్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలు చెత్తను కలెక్ట్ చేసే ఈ వెహికల్స్ ఏర్పాటు చేసాయి. ఆ వెహికల్ లో ఇంటింటికి తిరుగుతూ ఉదయాన్నే మైకు ద్వారా తెలుపుతూ చెత్తను కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా రోజూ జరిగే విషయమే.


ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించి వాటితో  ఈ ఆటోలు తీసి  నడపడం ద్వారా నెలకు 25 వేల వరకు జీతం వచ్చేలా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అది కూడా అవుట్ సోర్సింగ్ సెక్షన్లో చేసుకుంటూ వచ్చింది. పార్టీలకతీతంగా ఈ వర్క్ ను ఎలాట్ చేసింది ప్రభుత్వం. అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఈ మైక్ ప్రచారంతో నిద్ర లేచే జనాలకు మొన్నా మధ్య ఒక విచిత్రమైన అనౌన్స్మెంట్ వినపడడం జరిగింది.


అది కూడా పవన్ కళ్యాణ్ ప్రచార సభ గురించి వినపడిన ఆ అనౌన్స్మెంట్ విని అందరూ ఆశ్చర్యపోయారు.  వివరాల్లోకి వెళితే వైజాగ్ నగరంలోని 37వ వార్డులో ఈ ఆటో నడిపే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ పదో తారీకు వైజాగ్ వస్తున్నాడని ప్రచారం చేయడం జరిగింది. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం లోని జగదాంబ సెంటర్ కు వస్తున్నాడని ఆయన చెప్పడం జరిగింది.


కాబట్టి ప్రజలందరూ వచ్చి వారాహి విజయ యాత్రను సక్సెస్ చేయాలని ఆ వ్యక్తి కోరడం జరిగింది. అయితే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అభిమాని అవ్వడం వల్ల ఈ విధంగా చేశాడని అంటున్నారు.  నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఆటో ద్వారా రాజకీయ ప్రచారాన్ని చేశాడని ఆ వ్యక్తిని ఉద్యోగం నుండి  తొలగించారు. ఆ వ్యక్తికి  తన ఉద్యోగం కన్నా పవన్ కళ్యాణ్ మీద అభిమానమే ఎక్కువని తెలుస్తుంది. అయితే తనకు సంబంధించిన ప్రచారం చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడని తెలిస్తే పవన్ కళ్యాణ్ చేరదీస్తాడని జనాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: