పొత్తు: టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిందేనా?
ముఖ్యంగా బీజేపీ, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో గెలవకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసలైనటు వంటి అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థులు త్యాగానికి సిద్ధం కావాలి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 40 నుంచి 45 స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనసేనతో పొత్తు పెట్టుకుంటే 20 నుంచి 25 స్థానాలను కచ్చితంగా ఆ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. బీజేపీకి 10 నుంచి 15 స్థానాల వరకు ఇవ్వాలి. ఇలాంటి సందర్భంలో కచ్చితంగా 40 నుంచి 45 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు తమ స్థానాలను త్యాగం చేయక తప్పదు.
బీజేపీ కిందటి సారి 13 స్థానాల్లో పోటీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో 175 స్థానాల్లో 40 నుంచి 45 స్థానాలు జనసేన, బీజేపీకి ఇవ్వాల్సిందే. గెలిస్తే జనసేన పార్టీ నుంచి ముగ్గురు, లేదా నలుగురు, బీజేపీకి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాలి. ఇవే కాకుండా ఎంపీ స్థానాల్లో కూడా కొన్నింటిని టీడీపీ వదులుకోక తప్పదు.
ఎందుకంటే పొత్తు అంశం వచ్చేసరికి రెండు నుంచి మూడు స్థానాల్లో నైనా టీడీపీ జనసేన, బీజేపీకి వదులుకోవాల్సిందే. దీంతో అధికారంలోకి రావడం ఏమో కానీ బీజేపీ, జనసేన పొత్తుతో ఎన్నో రోజుల నుంచి పార్టీకోసం కష్టపడినా వారికి టికెట్లు కూడా ఇవ్వని పరిస్థితి ఎదురవనుంది. దీన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.