శభాష్.. రైతులకు మేలు చేసిన మోదీ?
కానీ ఈ విషయంలో నరేంద్ర మోడీ గారిని ఇప్పుడు అభినందించకుండా ఉండలేం. రైతులకు ఎరువులు, విత్తనాలు విషయంలో మోడిపైన కోపం, వ్యతిరేకతా ఎంతైనా ఉండవచ్చు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత గత తొమ్మిది ఏళ్లలో ఇప్పుడు అలా ఎరువుల కోసం బారులు తీరినట్టు, విత్తనాల గురించి బారులు తీరినట్టు ఒక్కరోజు కూడా వినపడడం లేదు. ఒకే కంపెనీ ఒకే ఎరువును రకరకాల ప్యాకెట్లలో ప్యాక్ చేసేసి, రష్యా నుంచి వచ్చేది ఒకే ఎరువైనా, ఈ ఎరువైతేనే కరెక్ట్ అన్నట్లుగా ప్రాజెక్ట్ చేసేస్తూ ఆ ఎరువునే నాలుగైదు కంపెనీలు నాలుగు ఐదు పేర్లుతో ప్యాకింగ్ చేసి, ఎక్కువ ప్రచారం చేసుకునే వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి అమ్మతుండడం జరుగుతుంది.
ఇలా చేస్తుంటే ఇప్పుడు అదంతా ఒకే ఎరువు కింద ముద్ర వేసే పరిస్థితి. ఇప్పుడు ఆ ఎరువుల్ని వేరేవాటికి మళ్ళించేసుకొని వాడేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వాటిని వేరే విధంగా మార్చకుండా వేపలో ముంచిన దాంతో ముద్ర వేస్తున్న పరిస్థితి. సబ్సిడీ ఒక బస్తా కి ₹2,000 దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. తాజాగా విత్తన బస్తాపై ట్రూత్ ఫుల్ లేబుల్ అతికించి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీనివల్ల నాసిరకమైన విత్తనాలను కాకుండా మంచి విత్తనాలను రైతు అనేవాడు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.