షాకింగ్‌: బ్రిటన్‌ ఎంపీల లంచాల బాగోతం?

ఆ మధ్యన ఎంపీలని డబ్బులు పెట్టి కొనేటువంటి ప్రయత్నం, దాంతో చాలామంది చిక్కుబడినటువంటీ అంశం. బంగారు లక్ష్మణ్ రాజీనామా చేశారు. అలాంటిదే ఇప్పుడు  బ్రిటన్ లో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ జరిగింది. ఎంపీ లకు ఒక బేరం పెట్టారు. ఒక ఫేక్ సంస్థను సృష్టించి ఆ సంస్థతో కార్యకలాపాలు నడపాలి. మీరేం చేయక్కర్లేదు, వారానికి ఒక రెండు రోజులపాటు రావాలి.

పార్లమెంటు సభ్యుడుగా మీకున్న పలుకుబడిని వాడి ప్రభుత్వంలో మాకు పనులు చేసి పెట్టాలి, సంస్థ ఎక్కడుంది అంటే ఇక్కడ కాగితం మీదే ఉంటుందీ, అది మేము వేరే దేశాల తరపు నుంచి నడుపుకుంటున్నాం అని ఈ సంస్థకు తరపున ప్రతినిధులుగా చెప్పుకున్నారు. వీళ్ళకి దాదాపుగా "డాన్ కీస్" అని పేరు పెట్టుకున్నారు. 20మంది ఎంపీలను అప్రోచ్ అయ్యారు.

అందులో 16మంది అధికార పార్టీ టొడి ఎంపీలు, ఇద్దరు లేబర్ పార్టీ ఎంపీలు, ఒక లిబరల్, డెమొక్రటిక్ ఒక ఇండిపెండెంట్ ఉన్నారు. ఈ ఊహాజనిత కంపెనీకి ఐదుగురిలో నలుగురు టొడి ఎంపీలు ఓకే చెప్పారు. దీంట్లో ఏంటయ్యా అంటే మెట్ హాన్ కాన్ అనే ఎంపీ గంటకి 10వేల డాలర్లు అడిగాడంట. క్వాజి క్వాటే అనే ఎంపీ 8వేల డాలర్లు అడిగాడంట గంటకు అక్కడికి వచ్చినందుకు మీటింగ్ లో పాల్గొన్నందుకు ఈ ఫేక్ ఓవర్సీస్ కంపెనీకి వీళ్ళిచ్చినటువంటిది కెమెరాల్లో రికార్డ్ అయింది.

మరొకవైపు చూస్తే 60వేల పౌండ్లు కావాలని సర్గ్రామ్ గ్రాడి అతను ఏడాదికి 60వేల పౌండ్లు అడిగాడట. టోటల్ గా ఎవరికి ప్రయోజనం కోసం అన్నటువంటిది కూడా అడక్కుండానే ప్రభుత్వంలో మా పలుకుబడిని మీకు వినియోగిస్తాం అని చెప్పి వీళ్ళు ఏంటంటే సౌత్ కొరియా కంపెనీ మాది అని చెప్పి ఈ ఫేక్ కంపెనీ తరఫున కొంతమందిని కలిసి చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో అన్ని పార్టీల ఎంపీలు కలిపి దొరికారు. ఇది బ్రిటన్ ప్రభుత్వాన్ని లేదా రాజకీయాన్ని ఒక కుదుపు కుదుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: