ఆర్టీఐ: ఈ హక్కుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జవాబుదారీతనంతో అధికారులు నిర్ణీత సమయంలో అర్జీదారునకు సమాచారం అందించాలని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది. తాజాగా తిరుపతి కలెక్టరేట్ నందు ఆర్.టి.ఐ దరఖాస్తులకు సంబంధించి కమీషనర్ కార్యాలయానికి అందిన వినతులపై సంబందిత శాఖల అధికారులతో, అర్జీదారులతో క్యాంప్ కోర్టు నిర్వహించారు. సమాచార హక్కు చట్టం పై అవగాహన కలిగి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి సమాచారం కోసం అర్జీలు పెరుగుతున్నాయని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది.
పి.ఐ.ఓ. లు, అపిలేట్ అథారిటీలు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తోంది. అధికారులు కార్యాలయాలలో భద్రపరిచే ఫైల్స్ ను ఇండెక్స్ ప్రకారం సిద్ధంగా ఉంచుకోవాలని.. ఆర్.టి.ఐ. చట్టం మేరకు వెబ్ సైట్ లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచిస్తోంది. అర్జీదారునకు కోరిన సమాచారాన్ని త్వరగా అందించడానికి కృషి చేయాలని సూచిస్తోంది.
ఏపీలో అధికారుల పని తీరు కొంత మేర పనితీరు బాగుందని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతున్నా.. ఇంకా కొన్ని సందర్బాల్లో మాత్రం సమాచారం ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తుందని రాష్ట్ర సమాచార కమీషన్ భావిస్తోంది. అర్జీదారుల సమస్యలను క్షేత్రస్ధాయిలో చర్చించి అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార కమీషన్ చెబుతోంది.