కండోమ్ రెడ్డి వర్సెస్ విగ్గు రాజు.. ఇదేం భాష బాబోయ్?
అందులో ఒకరు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కాగా.. ఇంకొకరు వైసీపీ నుంచి గెలిచినా వైసీపీ పాలనను రోజూ తిట్టే రఘురామ రాజు.. రఘురామ కృష్ణం రాజు.. కొంతకాలంగా ఢిల్లీలోనే ఉంటున్నారు. తన నియోజక వర్గానికి రావడం లేదు. దీనిపై విజయసాయిరెడ్డి కౌంటర్ వేస్తూ.. అడగకుండా నియోజక వర్గం వదిలి అజ్ఞాత వాసం, అరణ్య వాసం చేసే ఏకైక రాజు విగ్గు రాజు.. పెగ్గు రాజు అటూ రఘురామ కృష్ణంరాజుపై సెటైర్ వేశారు. రఘురామ కృష్ణంరాజు విగ్గు పెట్టుకుంటారు. అలాగే ఆయన ఢిల్లీ మందు పార్టీలు ఇస్తారని పేరుంది.
అందుకే vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">విజయసాయి రెడ్డి రఘురామ కృష్ణంరాజును విగ్గు రాజు, పెగ్గు రాజు అంటూ సెటైర్ వేశారు. దీనికి రఘురామ కృష్ణంరాజు కూడా ఘాటుగానే బదులిచ్చారు. అజ్ఞాత వాసం తర్వాత పాండవులకు.. అరణ్య వాసం తర్వాత శ్రీరాముడికి జరిగింది పట్టాభిషేకమే.. చచ్చింది కౌరవులు, దానవులు.. తెలుసుకోరా కండోమ్ రెడ్డీ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత విజయ సాయి రెడ్డి.. ఒరేయ్ డూప్లికేట్ గాజు.. నీ మీసాలైనా వరిజినలేనా లేక అవి కూడా పీకి అంటించుకున్నవా.. వాటిని మెలి తిప్పడం ఎందుకురా అంటూ కామెంట్ చేశారు విజయ సాయిరెడ్డి.
దీనికి కౌంటర్ ఇచ్చిన రఘురామ కృష్ణంరాజు.. ఎవరు ఒరిజినల్ రాజో.. ఎవరు డూప్లికేట్ రెడ్డో.. ప్రజలకు ఎరుక లేరా.. మనం కలిసినప్పుడు.. నా వెంట్రుకలన్నీ చూపిస్తా.. నువ్వే పీకి చూస్కో అంటూ రఘురామ కృష్ణంరాజు బదులిచ్చారు.