ఆహా.. తిరుపతి రైల్వే స్టేషన్ దశ తిరిగిందిగా?
దీంతో తిరుపతి స్టేషన్ అభివృద్ధి కోసం దక్షిణ మధ్య రైల్వే మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఇందు కోసం ఈపీసి విధానంలో వివిధ పనులను చేపట్టాలని నిర్ణయించింది. అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తారు. స్టేషన్ లో వివిధ ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతారు. పునాది స్థాయి, గ్రౌండ్ జీ+3 అంతస్తులతో దక్షిణం వైపు స్టేషన్ భవనం అభివృద్ధి చేస్తారు. అలాగే గ్రౌండ్ జీ+3 అంతస్తులతో ఉత్తరం వైపు స్టేషన్ భవనం అభివృద్ధి చేస్తారు. స్టేషన్ భవనం ఉత్తరం, దక్షిణం వైపు అనుసంధానం చేస్తూ ఎయిర్ కాన్కోర్స్ నిర్మాణం చేస్తారు.
ప్రస్తుత ప్లాట్ఫామ్ లను అభివృద్ధి చేస్తారు. ప్లాట్ఫామ్ లపై పైకప్పు నిర్మాణం చేస్తారు. దక్షిణం వైపు భాగంలో బేస్మెంట్ వద్ద పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. గౌండ్ ఫ్లోర్లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్ కౌంటర్, విశ్రాంతి గది ఏర్పాటు చేస్తారు. మొదటి, రెండవ అంతస్తులలో కామన్ విశ్రాంతి గది, మహిళల విశ్రాంతి గది, ఆహార శాల, మరుగుదొడ్లు, క్లాక్ రూమ్ ఏర్పాటు చేస్తారు. మూడో అంతస్తులో రైల్వే కార్యాలయాలు, విశ్రాంతి గదుల ఏర్పరుస్తారు.
ఉత్తరం వైపు గ్రౌండ్ ఫ్లోర్లో బయలుదేరే ప్రయాణికుల ఆవరణ, చేరుకునే ప్రయాణికుల ఆవరణ, టికెట్ కౌంటర్, వ్రిశ్రాంతి గది ఏర్పాటు చేస్తారు. ఈ స్టేషన్లో 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, సమాచారం తెలియజేసే డిస్ప్లే వ్యవస్థతో రూపు రేఖలో మారిపోనున్నాయి. అంతే కాదు. ప్రయాణికులకు వివరాలు అందజేసే వ్యవస్థ, సిసిటీవి కెమెరాలు, కోచ్ వివరాలు, రైళ్ల వివరాలు తెలియజేసే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు.