ఉద్యోగుల సమ్మెపై పవన్ కల్యాణ్ షాకింగ్‌ కామెంట్స్..?

విజయవాడలో ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ సభ విజయవంతమైంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి విజయవాడను హోరెత్తించారు. వేల సంఖ్యలో కదిలి వచ్చి చలో విజయవాడ కార్యక్రమాన్ని ఊహించిన దాని కంటే ఎక్కువగానే విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఉద్యోగుల్లో ఆత్మ స్థైర్యం పెరిగింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలకు అన్ని వైపుల నుంచి మద్దతు వస్తోంది. 




ఉద్యోగుల చలో విజయవాడ అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తాజాగా స్పందించారు.  ప్రజల అవసరాలు తీర్చాల్సిన ఉద్యోగులు ఇలా.. రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్‌ ఆవేదనతో అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పిన జగన్..  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సంగతి పూర్తిగా మరిచిపోయారని విమర్శించారు పవన్ కల్యాణ్..


గతంలో ఉద్యోగుల జీతాలు భారీగా పెంచుతామని హామీలిచ్చిన జగన్ ప్రభుత్వం.. ఏనాడు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా జీతాలు పెంచలేదని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఒకవైపు జీతాలు పెంచామని చెబుతుంటారు.. మరోవైపు వారి జీతాల్లో కోత విధిస్తుంటారు. ఇది పూర్తిగా ఉద్యోగులను మోసం చేయడమేనని పవన్‌ కల్యాణ్ అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమంలో రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయడం లేదని ఉద్యోగ సంఘాలు చెప్పినందుకే ఈ అంశంపై తాను మౌనంగా ఉన్నానని చెప్పారు.


ఉద్యోగుల విజ్ఞప్తికి కట్టుబడి ఉన్నందునే ఇప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడలేదని పవన్‌ వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులను కూడా  వంచించిందని చెప్పారు. లక్షల మంది ఉద్యోగులు మండుటెండలో రోడ్లపైకి వచ్చారని కానీ.. వారికి న్యాయం మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. ఉద్యోగుల పోరాటంలో వారివైపే జనసేన ఉంటుందని.. ఉద్యోగులంతా కలసి కట్టుగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పవన్ కల్యాణ్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: