ఆర్మీలో చేరాలనుకునే యువతకు కేంద్రం గుడ్ న్యూస్!

Purushottham Vinay
ఆర్మీలో చేరాలనుకునే యువతకు కేంద్రం గుడ్ న్యూస్! భారతదేశంలోని యువత కోసం రక్షణశాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీలో యువతను నింపాలనే ఉద్ధేశ్యంతో భారతీయ యువత కోసం కొత్త స్కీమ్‌ను ప్రకటించింది.ఇక అదే 'అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌'. ఈ స్కీమ్ ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు (14,2022) ప్రకటించడం జరిగింది. అగ్నిపథ్ స్కీమ్ కింద దేశంలోని యువతను దేశ రక్షణ దళంలోకి తీసుకునే అవకాశం దీని ద్వారా కల్పించబడుతుందని ఆయన తెలిపారు. ఈ కొత్త టెక్నాలజీతో యువతకు సరైన శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే సైన్యంలో చేరే యువత ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా వారు ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఈ పథకం కింద యువత నాలుగు సంవత్సరాల పాటు దళాలలో చేరి దేశానికి తమ సేవ చేస్తారు.ఇక ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలోకి సుమారు 45 వేల మందిని రిక్రూట్ చేయనున్నారు. అందులో 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వయసులోపు వారే దీంట్లో ఉంటారు. 


అయితే నాలుగేళ్ల పాటు ఈ యువత సర్వీసులో ఉంటుంది. ఆ నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది సైనికుల్ని మాత్రమే ఆర్మీలోకి రెగ్యులర్ క్యాడర్‌గా వారు తీసుకుంటారు. ఇక వాళ్లు మాత్రమే 15 ఏళ్ల సర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్లకు మంచి వేతన ప్యాకేజీని (ఎగ్జిట్ రిటైర్మెంట్ ప్యాకేజీ) ఇచ్చి వారిని ఇంటికి పంపిస్తారు.ఇక ఈ ఉపాధి గురించి మాట్లాడుతూ..మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, 'అగ్నిపథ్’ పథకం కింద..సాయుధ దళాల యువత ప్రొఫైల్‌ను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇది వారికి కొత్త సాంకేతికతలకు శిక్షణ ఇవ్వడానికి ఇంకా అలాగే వారి ఆరోగ్య స్థాయిలను కూడా బాగా మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.ఇది నిజంగా ఆర్మీలో చేరాలనుకునే యువతకు కేంద్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: