ఇవిగో.. ఇండియన్స్ ఉప్పొంగిపోయే సాక్ష్యాధారాలు?
శ్రీకృష్ణదేవరాయల కాలం లో సాగునీటి ప్రాజెక్టులు కట్టబడ్డాయట. అశోకుడు కాలం నాటి అద్భుత వ్యవస్థలు గురించి కూడా మనం విన్నాం. అయినా కూడా మన వాళ్ల గొప్పతనాన్ని తక్కువ చేస్తూ అన్నిటికీ కారణం పరాయి వాళ్లే అన్నట్లు భావిస్తూ ఉంటారు మనలోనే కొంతమంది. వాళ్లు, దేశ చరిత్రకు పట్టిన దురదృష్టం అనుకోవాలి. మన సంస్కృతిని, సంపదను దోచుకుపోయిన దొంగలదే అసలైన సంస్కృతి, నాగరికత అనుకుంటారు వాళ్లు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మధ్యప్రదేశ్ లో 2000 సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే ఆధునిక సమాజం ఉన్నట్లుగా వాటి ద్వారా తెలుస్తుంది. మధ్యప్రదేశ్ లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆధునిక సమాజం అని శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రదేశాలు బయటపడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి రాక్ పెయింటింగ్స్ ఇంకా వాటర్ బాడీస్ నీటి నిల్వ ప్రదేశాలు అక్కడ లభించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు.
అంతేకాకుండా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి కొండలని నివాసాలుగా ఏర్పరిచారు అని తెలుస్తుంది. గతంలో కూడా వ్యాపారం నిమిత్తం లేదా మరో నిమిత్తం ఒకచోట నుండి మరోచోటికి ప్రయాణించాల్సి వచ్చేది. అలా ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం అప్పట్లోనే కొండలను గుహలుగా మలిచి వారికి వసతిని ఏర్పాటు చేసే వారిని తెలుస్తుంది. వంట చేసుకోవడానికి కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయట.