జనసేన కార్యకర్తలు ఆ షాక్‌ తట్టుకుంటారా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లో ఉన్నట్లు ఓ సర్వే ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, టీడీపీ యువ నేత లోకేశ్ ముగ్గురు కూడా యువత కావడం గమనార్హం. యువత ఎక్కువగా రాజకీయాల్లోకి రావడం వల్ల సమూలమైన మార్పులు వస్తాయి. రాజకీయాల్లో ప్రశ్నించే తత్వం వస్తుంది. జనసేన పార్టీ తరఫున ఎక్కువ మంది యూత్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ అభిమానులు ఎక్కువగా యువకులే ఉంటారు.  

2014 ఎన్నికల నాటికి ప్రస్తుతానికి పవన్ కల్యాణ్, ఆయన పార్టీలో మార్పు వచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ను ఓడించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జన సేన పార్టీకి  సానుకూల పరిణామమే. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడు పార్టీ పెట్టిన పది సంవత్సరాల గెలుపే ధ్యేయంగా ముందుకెళుతున్నారు. జనసేనకు కూడా ఇంతటి ఊపు గతంలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని అధికారంలోకి రావాలి. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం జన సేనలో ఉన్న కొంతమంది యువ నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు దక్కేలా లేవు.

పవన్ యువకులను పార్టీలో ప్రోత్సహిస్తున్నరనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ పొత్తుల అంశం తెరపైకి వచ్చినపుడు యువకులు సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. అంతిమ లక్ష్యం జగన్ ను గద్దె దించడం. దీని కోసం ఎవరితోనైనా పొత్తుకు రెడీ అని గతంలో పవన్ ప్రకటించారు. కానీ జన సైనికులు పవన్ ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఇలాంటి సమయంలో పార్టీకి వెన్నుముక లాంటి యువకుల మాటలు వింటారా.. లేక జగన్ ను ఓడించడానికి యువతరాన్ని చెప్పిన విషయాన్ని పక్కన పెడతారా చూడాలి. అయినా పవన్ కోసం జన సైనికులు సర్దుకు పోయేందుకు సిద్ధమనే తెలుస్తున్నా.. సీఎంగా మాత్రం పవనే ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: