ఆ దేశంలో అంతర్యుద్దం.. ప్రపంచమే వణుకుతోంది?

పాత కాలంలో ఒక రాజు రాజకీయ కాంక్ష తో, పక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలనుకుంటే కత్తి దూసి యుద్ధం చేసేవాడు. అక్కడ రక్తపాతం జరిగేది.‌ చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. అప్పటి యుద్ధాలు, అలాంటి యుద్ధాలు ఒక రకం అయితే, అసలు రక్తపాతం లేకుండా మనిషిని చంపేసే  బయోవార్ ఎఫెక్ట్ ని మనం ఈ మధ్యన గట్టిగానే అనుభవించాం.

యుద్ధాలు ఇద్దరు నాయకులు మధ్య ఉన్న సంఘర్షణ వల్ల పుడతాయని, ద్వేషం వల్ల పుడతాయని, ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక ఆయుధాల వల్ల ప్రపంచమంతా కూడా తీవ్రంగా నష్టపోతుందని మనకు తెలుసు. అదే ఒక రెండు దేశాలు ఎలాంటి ఆయుధాలు వాడకుండా చేసే యుద్ధమే ఈ బయోవార్. దానిలో భాగమే కోవిడ్ 19 కరోనా వైరస్.

అమెరికా చైనాలు ఒక ప్లాన్ ప్రకారం ల్యాబ్ లో తయారు చేసిన ఈ కోవిడ్ 19 వైరస్ వాళ్ల ప్రయోగంలో భాగంగా లీక్ అయ్యి వాళ్ళున్న చోటనుండే మారణ కాండను ప్రారంభించి ప్రపంచమంతా కూడా ఎక్కడున్న వాళ్ళని అక్కడే కట్టి పడేసిన సందర్భం అది. బయటకు వెళ్లలేక, భార్యాభర్తలు కూడా ఒకరు పక్కన ఒకరు ఉండలేక, చేయడానికి పని లేక, తినడానికి సంపాదన లేక ఈ వైరస్ బారిన బడి అనేక మంది చనిపోయారు. ఇప్పటివరకు జరిగిన ప్రపంచ యుద్ధాలలో ఎంతమంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందో అంతకుమించిన నష్టాన్ని రక్తపాతం లేకుండా చవి చూపించిన వైరస్ అది.

అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సుడాన్ లో  పరిపాలన అధికారం కోసం సైనిక చీఫ్ కి, పారా మిలటరీ చీఫ్ కి మధ్య జరుగుతున్న దాడుల్లో అక్కడ ఉన్నటువంటి బయో లేబరేటరీ ధ్వంసం అయ్యింది అంట. మరి ఆ బయోలాబ్ లో ఎటువంటి భయానక వైరస్ పురుడు పోసుకుంటుందో, ఇప్పుడు జరిగిన ఈ ధ్వంసం వల్ల ఏ వైరస్ ప్రపంచం మీదకి పాకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది వాళ్ల వల్ల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: