రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

ఒకటే దెబ్బకు రెండు పిట్టలనేది కోమటిరెడ్డి వ్యూహమని తెలుస్తుంది‌. మల్లికార్జున ఖర్గే మంచిర్యాలకి వచ్చినా సరే విపరీతమైన ప్రచారం అయితే కాంగ్రెస్ కి రాలేదు. రేవంత్ తో పాటు బట్టి విక్రమార్క వీళ్ళందరూ గట్టిగా కష్టపడడంతో సత్యాగ్రహ సభకి భారీగానే స్పందన వచ్చినట్లు తెలుస్తుంది. మంచి గేదరింగ్ అయితే జరిగింది అక్కడ. ఎసిసి అధ్యక్షులు అయిన తర్వాత తొలిసారిగా జరిగినటువంటి సభకు ప్రత్యేక హెలికాఫ్టర్ లో తీసుకొచ్చి మరీ అక్కడ మీటింగ్ పెట్టారు.

కోమటిరెడ్డి మొన్న మోడీని కూడా కలిసి వచ్చారు. రేవంత్ రెడ్డిని ఎదగనివ్వకుండా చేద్దాం అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వకుండా చేయాలనుకున్నారు. కానీ రేవంత్ అయ్యారు. పిసిసి చీఫ్ కానివ్వకుండా చేద్దాం అనుకున్నారు, కానీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్న సందర్భంలో కోమటిరెడ్డి మళ్ళీ బయటికి వెళ్లిపోవాలని చూస్తున్నారని తెలిసి హ్యాపీ ఫీలయ్యారు రేవంత్. కానీ తీరా చూస్తే మొన్న మల్లికార్జున ఖార్గే తో మీటింగుకు అటెండ్ అవ్వడంతో పాటు, కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు కోమటిరెడ్డి.

కేసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం ద్వారా ప్రచారంలోకి వస్తున్నారు కాబట్టి, దళిత సామాజిక వర్గం బలంగా ఉన్న తెలంగాణలో ఓట్లు తెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి మన పార్టీ ఓట్లకే గండి కొడుతున్న కేసీఆర్ ను దెబ్బ కొట్టాలంటే దళిత ముఖ్యమంత్రిని చేస్తాం అనే సవాలు చేద్దామని డిమాండ్ తెచ్చారు. అధిష్టానం దృష్టిలోకి తీసుకెళ్లిపోయారు కూడా. ఇది పెద్ద షాకింగ్ న్యూస్. రెడ్డి సామాజిక వర్గం నుండి తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఏ భట్టి విక్రమార్క లాంటి వ్యక్తో అయితే అసలు ఎవరి గొడవ ఉండదు. ఒకటి రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడం,అలాగే అధిష్టానం లో పాజిటివ్ ఫీలింగ్ తెచ్చుకోవడం ఇలా ఒకటే దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని చూస్తున్నారు కోమటిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: