రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం: విలవిల్లాడుతున్న జర్మనీ?

జర్మనీ లో కొత్త అణు సంక్షోభం తలెత్తేలా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అన్ని దేశాల కంటే ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా దెబ్బతిన్న దేశం జర్మనీ. ముఖ్యంగా ఈ దేశం పెట్రోల్, డిజీల్, గ్యాస్ అమ్మకాల ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదించేది. ఆయిల్ ను రష్యా నుంచి కొనుక్కుని వివిధ దేశాలకు ఎక్కువ ధరకు అమ్ముకుని  ప్రపంచంలోనే ఆర్థికంగా 7 వ స్థానంలో కొనసాగింది. అలాంటిది ప్రస్తుతం జర్మనీలో కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సమయంలో జర్మనీలో అణు విద్యుత్ కర్మాగారాలు, జల విద్యుత్ కర్మాగారాలను తెరిచి అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసి దేశంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ఇక్కడ ఒక సమస్య ఎదురవుతోంది. అణు విద్యుత్ కర్మాగారాలను 30 సంవత్సరాల తర్వాత మూసివేయాలి. ప్రస్తుతం వాటి డేట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వాటిని తెరచి పనులు ప్రారంభిస్తున్నారు. దీని వల్ల ఎదైనా సమస్య వస్తే చాలా మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ జర్మనీ తప్పనిసరి పరిస్థితుల్లో అణు కర్మాగారాలను తెరచి విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏమోగానీ ఆర్థికంగా కుదేలై, విద్యుత్ కోతలతో తల్లడిల్లుతోంది.

ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా జర్మనీలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. విద్యుత్ లేదు. ఇలా ఎన్నో సమస్యలు జర్మనీని చుట్టు ముట్టాయి. ఒకప్పుడు విలాసవంతమైన దేశంగా ఆర్థికంగా ఎంతో బలంగా జర్మనీ ఉండేది. ఇప్పుడు ఉద్యోగాలు పోయి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీనికి కారణం రష్యా, ఉక్రెయిన్ యుద్ధమేనని ఉక్రెయిన్ కు ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవాలని రోడ్డెక్కి అక్కడి ప్రజలు  నిరసలు చేస్తున్నారు. అయినా జర్మన్ ప్రభుత్వం అమెరికాకు ఇచ్చిన మాట ప్రకారం.. ఉక్రెయిన్ కు  ఆయుధాలను సరఫరా చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: