కిమ్ అరాచకం.. బుల్లెట్ల కోసం లాక్డౌన్?
653 బుల్లెట్లు ఉత్తర కొరియాలో మాయమయ్యాయని నార్త్ కొరియా అధ్యక్షుడు గ్రామంలో లాక్ డౌన్ విధించాడు. ఆ గ్రామం నుంచి ఎవరూ బయటకు రాకుండా చేశాడు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టిస్తున్నాడు. ప్రస్తుతం నార్త్ కొరియాలో ఉన్నటువంటి పరిస్థితి.
కొంతమంది సోల్టర్స్ దగ్గర మిస్సైన బుల్లెట్ల గురించి వెతుకుతున్నారు. 22 రోజులుగా ఈ బుల్లెట్ల గురించి వెతుకుతున్నారని తెలుస్తోంది. ఎక్కడైతే మిస్ అయ్యాయని అనుమానిస్తున్నారో ఆ ప్రాంతంలో పూర్తిగా లాక్ డౌన్ పెట్టి వెతుకుతున్న పరిస్థితి. అయినా అది దొరకడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నార్త్ కొరియాలో ఎలాంటి అధికారం నడుస్తుందో. అమెరికా అయితే దాదాపు 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఆయుధ సామగ్రిని విడిచిపెడితే ఇక్కడ కేవలం 653 బుల్లెట్ల కోసం 22 రోజులుగా వెతుకుతున్నారు.
నార్త్ కొరియాలో కిమ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కోల్పోయారని ఇప్పటికే చాలా సంస్థలు చెప్పుకొచ్చాయి. మీడియాకు స్వేచ్ఛ లేదు. కేవలం రెండు మూడు మీడియా సంస్థలు ప్రభుత్వం చెప్పినట్లు మాత్రమే వార్తలు రాయాలి. వ్యతిరేకంగా రాస్తే అస్సలు ఒప్పుకోరు. వారికి కఠినంగా శిక్షలు విధిస్తారు. ఇలా కఠిన నిబంధనలతో పూర్తి ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నాడు కిమ్.
ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే కఠిన శిక్షలు విధిస్తారు. ఇంత జరుగుతున్నా సరే కిమ్ ను దేవుడిగా కొలుస్తారు. నార్త్ కొరియా దేశ రక్షణ కోసం కిమ్ అణు సామర్థ్యాన్ని పెంచి అమెరికానే బెదిరించే స్థాయికి ఎదిగాడు. బుల్లెట్లు దొరక్కపోతే ఆ దేశ పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి.