పాకిస్తాన్‌, తాలిబన్‌ వార్‌.. మధ్యలో చైనా?

చైనా ప్రస్తుతం భీష్ముడి పాత్ర పోషిస్తున్నట్టు ఉంది. అందుకే శిక్ష అనుభవించే పరిస్థితిలో ఉంది. అదేమిటంటే భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ఉత్తరాయణానికి ముందు కృష్ణుడు కలుస్తాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడిని ఏమిటి నాకీ కర్మ, ఇంత కష్టపడి నేను అన్నీ త్యాగం చేసి కురువంశాన్ని ఉద్ధరిస్తూ వచ్చాను, ఇంత బాధ్యతగా ఉన్న నాకా ఇట్లాంటి బ్రతుకు అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు మంచి కార్యాలు చేసేవు, కానీ అదే సందర్భంలో కళ్ళ ఎదురుగుండా ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావు. నువ్వు కురువంశాన్ని ఆపగలిగినవాడివైయ్యుండి నువ్వే పట్టించుకోనప్పుడు కారణజన్ముణ్ణి నేను ఎట్లా ఆపుతాను అని చెప్తాడు.

ఇప్పుడు తాజాగా జరిగే దానికి మహాభారత ఈ ఘటనకు సంబంధం లేకపోయినా చూస్తూ కూర్చుంటే జరిగే నష్టం విషయంలో చెప్పాల్సి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు చైనాకు స్నేహ హస్తం. పాకిస్తాన్ ను ఆక్రమించుకుని ఇస్లామిక్ రాజ్యాన్ని క్రూరమైన మధ్యయుగం నాటి పరిస్థితులకు తీసుకెళ్లాలి అనేది ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తాలిబన్ల ఉద్దేశం. ఒకరకంగా భారతదేశంలో ముస్లింలు స్వేచ్ఛగా ఎలా బతుకుతున్నారో, అక్కడ కూడా అలానే బతుకుతున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరు గొడవని కంట్రోల్ చేసే శక్తి చైనాకుంది.

బెల్ట్ & రోడ్డు ఇనిషియేటివ్ అనేది పాకిస్తాన్ మీద నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వెళ్లాలి. అందుకని చైనా చూస్తూ కూర్చుంటుంది. బోర్డర్ లో తాజాగా తన్నుకు చావడం, కాల్చేసుకోవడం ఎక్కడికక్కడ ట్రాఫిక్కులు ఆపేసుకోవడం, ఇంకో పక్కన పాకిస్తాన్ పంపించేటువంటి తహరిన్ కి తాలిబన్ ఈ పాకిస్తాన్ వాళ్ళ అరాచకాలు ఇవన్నీ కంటిన్యూగా జరుగుతూనే ఉన్నా  చైనా మాత్రం తన స్వార్థం తాను చూసుకుంటుంది. చైనా పాకిస్తాన్ తో  స్నేహం చేస్తున్నది, ఆటు ఆఫ్ఘనిస్తాన్ తోనూ స్నేహం చేస్తుంది. తన ప్రయోజనం కోసమే అంటుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఈజీగా పరిష్కరించగలిగినా  చైనా పరిష్కరించదు. అందుకనే భీష్ముడు లానే చైనా కూడా దీనికి అనుభవిస్తుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: