వైసీపీలో వాళ్లకే పదవులు వస్తాయా.. నిజం ఏంటి?
నెల్లూరు జిల్లాలో వారసత్వ రాజకీయాలతో పాటు వారి పిల్లలు వారి మనమలు కూడా ఎమ్మెల్యేలుగా ఉండాలని కోరుకుంటూ వారే గెలవాలని ఆశిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇదే సమయంలో కోటంరెడ్డి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే కుటుంబ నాయకులు ఉన్నప్పటికీ అనిల్ యాదవ్ లాంటి వ్యక్తి కూడా మంత్రి అయ్యారు. ప్రజలను నమ్ముకుని గెలిచారు. దానికి సంబంధించి వారి నాయకుడు జగన్ ఆయనను మంత్రి కూడా చేశారు.. ఇదే విధంగా శ్రీధర్ రెడ్డి కూడా మరి కాస్త ఓపిక బట్టి ప్రజల్లో తిరుగుతూ ప్రజల మనిషిగా నిలిస్తే పదవులు వాటి అంతటావే వస్తాయి.
కానీ ఇలా పది మందిలో పదవి రాలేదని వేరే వాళ్ళు రాజకీయాలన్నీ శాసిస్తున్నారు అనడం వల్ల ఏమాత్రం లాభం లేదు. ఒక వ్యక్తికి గుర్తింపు అనేది ప్రజల నుంచి వస్తే దానికి సంబంధించి లాభం కచ్చితంగా జరుగుతుంది. మరి కోటంరెడ్డి భవిష్యత్తులో మంత్రి అవుతాడా ఇలాగే ఎమ్మెల్యే గానే ఉండి పోతాడా చూడాలి.