2 శాతం ఓట్ల తేడాతో.. ఆ దేశంలో రచ్చరచ్చ?

బొల్సినారోని మళ్లీ అధ్యక్షుడిని చేయాలి. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడిని దించేయాలని బ్రెజిల్ దేశ రాజధానిలో అరాచకాలు జరుగతున్నాయి. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైల్ బొల్సినారో మద్దతుదారులు దేశ అధికారిక భవనాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ కాంగ్రెస్, సుప్రీం కోర్టు, అధ్యక్ష భవనాల్ని ముట్టడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బొల్సినారో ఓటమిని మద్దతు దారులు నిరాకరిస్తున్నారు. దేశాధ్యక్షుడిగా లూయిజ్ వారం రోజుల క్రితమే పదవి చేపట్టారు. దీనికి నిరసనగా మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు దేశ వ్యాప్తంగా భద్రత వలయాలను ఛేదించుకుని అధికారిక భవనాలను ముట్టడించాారు.

దాదాపు 3000 మంది అల్లరి మూకలు ఈ నిరసనలో పాల్గొన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారిని చెదరగొట్టేందుకు సుప్రీం కోర్టు వద్ద భద్రత దళాలు హెలిక్యాప్టర్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతటి అరాచకం జరుగుతుంటే బొల్సినరో కడుపునొప్పితో హాస్పటల్లో చేరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బోల్సినార్కు 49 శాతం ఓట్లు ప్రస్తుత అధ్యక్షుడు అయినటువంటి లుయిజకీ 51 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అవినీతి జరిగిందని ఎన్నికలు రద్దు చేయాలని బొల్సినారో వర్గం మద్దతుదారులు చేపట్టిన విధ్వంసం అంతా ఇంతా కాదు.

ఈ ధర్నా చేపట్టిన వారు ఈ ఆందోళనకు దిగిన వారిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని వారందరూ శిక్ష అనుభవించక తప్పదని బ్రెజిల్ అధ్యక్షుడు హెచ్చరించారు. గతంలో ఇదేవిధంగా అమెరికాలో ట్రంప్ మద్దతుదారులు కూడా చేసిన విధ్వంసం అందరికీ గుర్తుండే ఉంటుంది. మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడికి సూచించారు మనకు తెలిసి మనలాంటి ప్రజాస్వామ్య దేశం ఎక్కడ లేదు. ఇలాంటి దేశాల వారు ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సి ఉంటుంది. పాటిస్తే మరీ బాగుంటుంది. ఏదేమైనా బ్రెజిల్ లో జరిగిన విధ్వంసం ఆ దేశానికి మాయని మచ్చగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: