హెరాల్డ్ ఎడిటోరియల్ : గంటాకు వైసిపి ఎంట్రి కష్టమేనా ? ...అవంతి పర్ ఫెక్ట్ స్కెచ్ ?
తర్వాత భీమిలీలో పోటి చేయటం మంచి మెజారిటితో గెలవటం తర్వాత ఏకంగా మంత్రే అయిపోయాడు. సీన్ కట్ చేస్తే గంటా విషయం కాస్త తిరగబడింది. ఎన్నికలకు ముందే గంటా కూడా టిడిపి నుండి వైసిపిలోకి వద్దామని ప్రయత్నం చేసినా సాధ్యంకాలేదు. లోకల్ లీడర్లు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో గంటా జాయినింగ్ నిలిచిపోయింది. తర్వాత టిడిపి చిత్తుగా ఓడిపోయినా వైజాగ్ సిటి నార్త్ నియోజకవర్గంలో గంటా మాత్రం గెలిచాడు. అప్పటి నుండి గంటా మనసంతా వైసిపి చుట్టూనే తిరుగుతున్నట్లు రెండు పార్టీల్లోను ప్రచారం మొదలైంది. ఎప్పటికప్పుడు గంటా వైసిపిలోకి వచ్చేస్తాడనే ప్రచారం జరగటం తర్వాత తుస్సుమనటం అందరికీ తెలిసిందే. ఈ ప్రచారమంతా ఎల్లోమీడియా చానల్స్ లోనే ఎక్కువగా జరుగుతోంది. ఇందులో భాగంగానే గడచిన 15 రోజులుగా మాత్రం ప్రచారం మరింత ఉధృతంగా జరిగింది.
వైసిపిలో గంటా ఎంట్రీ ప్రచారం ఎంతస్ధాయిలో జరుగుతోందంటే ఏకంగా గంటా చేరికకు ముహూర్తం కూడా ఫిక్సయిపోయిందట. ఈ నేపధ్యంలోనే గంటా ఎంట్రీకి బ్రేకులు పడిపోయిందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. అదేమంటే అవంతి దెబ్బకు గంటాకు నో ఎంట్రీ బోర్డు ఎదురైందంటూ చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే గంటా మేనల్లుడు విజయ బాబును పోలీసులు ఈమధ్యనే అరెస్టు చేశారు. భూ కబ్జా కేసులో విజయే కీలక వ్యక్తిగా చెప్పిన పోలీసులు కేసు బుక్ చేయటమే కాకుండా అరెస్టు కూడా చేసేశారు. ఎప్పుడో 1991లో ప్రభుత్వం వికలాంగుల కోసం కేటాయించిన భూమిని 2014 తర్వాత కబ్జాకు గురైందట. గంటాను అడ్డం పెట్టుకుని విజయ అండ్ కో సదరు భూమికి నకిలీ పత్రాలు సృష్టించి ఓనర్లను సృష్టించి ఎవరిపేరుపైనో విజయ్ రిజిస్టర్ కూడా చేయించేశాడట.