అయ్యో దేవుడా.. ఆ బాలికకు ఎంత పరీక్ష పెట్టావయ్యా?

praveen
అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో విధి కొన్ని కొన్ని సార్లు మనిషికి ఊహించని పరీక్షలు పెడుతూ ఉంటుంది. అనూహ్యమైన పరిస్థితులకు కారణమవుతూ ఉంటుంది. ఓ దేవుడా నాకే ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు అని మనిషి దీనంగా దేవుడిని అర్థించే పరిస్థితికి కారణమవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన గురించే. ఆ విద్యార్థికి నాన్నంటే చచ్చేంత ప్రేమ. చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా చూసుకున్న నాన్నను పెద్దయ్యాక తాను కూడా సంతోషంగా చూసుకోవాలని అనుకుంది. పెద్ద పెద్ద చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని అనుకుంది.

 ఇక ఆమెకు నాన్న నుంచి తోడ్పాటు ఎలాగా ఉంది. అయితే ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థి పరీక్షల కోసం బాగా చదువుతూ ఇక చదివినవన్ని పరీక్షల్లో రాస్తూ టాప్ ర్యాంకు కోసం ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో దేవుడు ఆమెకు అనుకోని పరీక్ష పెట్టాడు. ఏకంగా అల్లారుముద్దుగా పెంచుతూ తనకు తోడునీడగా ఉన్న తండ్రిని దూరం చేశాడు. దీంతో ఇక ఆమె గుండెల్లో కొండంత దుఃఖం నిండిపోయింది. ఈ హృదయ విదారక ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. ఒకవైపు అల్లారూ ముద్దుగా పెంచుకున్న తండ్రి ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక తండ్రి దగ్గరే ఉండాలా.. లేదంటే తండ్రి కోరుకున్న భవిష్యత్తు కోసం ఎగ్జామ్స్ సెంటర్ కు వెళ్లి పరీక్ష రాయాలా ఆ విద్యార్థి మనసుకు పాలు పోలేదు.

 కొండంత బాధను గుండెల్లో పెట్టుకొని చివరికి తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం పరీక్ష రాసింది ఆ విద్యార్థి. హనుమాన్ నగర్ కు చెందిన సోమేశ్ అనారోగ్యంతో ఇటీవలే చనిపోయారు. అయితే అతని పెద్ద కుమార్తె  మానసిక స్థితి సరిగ్గా లేదు. దీంతో సోమేశ్ ఆశలన్ని కూడా చిన్న కుమార్తె దీల్లీశ్వరి పైనే ఉండేవి. అయితే ఇటీవల తండ్రి చనిపోవడంతో ఆమె కొండంత శోకంలో మునిగిపోయింది. బంధువులు కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో.. ఏకంగా పరీక్ష రాసి వచ్చి అంత్యక్రియలను పూర్తి చేసింది సదరు బాలిక. ఇక ఈ విషయం తెలిసి ఓ దేవుడా ఆమెకు ఎంతటి పరీక్ష పెట్టావయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: